BigTV English
Advertisement

Farooq Abdullah: కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమే.. ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Farooq Abdullah: కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమే.. ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..
Farooq Abdullah
Farooq Abdullah

Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ భారతదేశంలో భాగమేనని, ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని అన్నారు.


‘రాజ్యాంగం, జాతీయ ఐక్యత సమావేశం-2024’లో ప్రసంగించిన ఫరూక్ అబ్దుల్లా, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ప్రజలకు ఒక నిజమైన ఎన్నికలను అందజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

“నా ప్రజల నుంచి నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం, భారత్‌లో భాగమే, ఎప్పటికీ భారత్‌లో భాగమే అవుతుంది’’ అని అబ్దుల్లా అన్నారు. ఏదేమైనా, దేశవైవిధ్యం బలంగా మారాలంటే దానిని రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.


Read More: Nafe Singh Rathi: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రెసిడెంట్ దారుణ హత్య..

“మతం మనల్ని విభజించదు, మతం మనల్ని ఏకం చేస్తుంది. చెడు అనే మతం లేదు, దానిని చెడుగా ఆచరించేది మనమే. మనం ముందుకు వెళ్లాలంటే, ఒకరికొకరు అండగా నిలవడం, ఈ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఏకతాటిపై ఎదుర్కోవడం, మనల్ని విభజించాలనుకునే దురాచారాలపై పోరాడడమే ఏకైక మార్గం’ అని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగానికి నేడు ముప్పు పొంచి ఉందని తెలిపారు. అది బలంగా ఉండేలా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేకపోతే చింతించాల్సి వస్తుందని అన్నారు.

Tags

Related News

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Big Stories

×