E-Paper
Advertisement

Akhilesh Yadav: బంగ్లాదేశ్ అల్లర్లు.. అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Akhilesh Yadav: బంగ్లాదేశ్ అల్లర్లు.. అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Akhilesh Yadav latest news(Telugu breaking news today): బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పరోక్షంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు పొరుగు దేశంలోని పరిస్థితులను ఉపయోగించుకుంటే చివరికి ఆ దేశమే బలహీనపడుతుందని అన్నారు. ఆయన ఏ దేశం పేరునూ ప్రస్తావించలేదు. అయితే బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఒక దేశంలోని పరిస్థితులను మరో దేశం ఆసరాగా చేసుకుని తమకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని అనుకుంటే అది వారిని అంతర్గతంగా, బాహ్యంగా బలహీనపరుస్తుంది. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడం సరైన చర్య కాదు. అక్కడ ప్రదర్శలు హింసాత్మకంగా మారితే.. మౌనంగా ఉండటం సరికాదు. అది విదేశాంగ విధాన వైఫల్యమే అవుతుందని ఎక్స్ వేదికగా అఖిలేశ్ పేర్కొన్నారు.

Advertisement

Also Read: కలకత్తా ట్రైనీ వైద్యురాలి ఘటనపై దర్యాప్తునకు దీదీ డెడ్‌లైన్

అంతకు ముందు చేసిన మరో పోస్టులో కూడా ఆయన బంగ్లాదేశ్ పేరును ప్రస్తావించారు. సరైందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే పలు సందర్భంల్లో వివిధ కారణాలతో అనేక దేశాల్లో హింసాత్మక విప్లవాలు, తిరుగుబాట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో ఆ దేశం మాత్రమే తిరిగి పుంజుకుంది. బంగ్లాదేశ్‌లో శాంతి స్ధాపనకు కేంద్రం కృషి చేయాలి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఈ అంశాన్ని భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తాలని అన్నారు. బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×