E-Paper
Advertisement

Akhilesh Yadav: బంగ్లాదేశ్ అల్లర్లు.. అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Akhilesh Yadav: బంగ్లాదేశ్ అల్లర్లు.. అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Akhilesh Yadav latest news(Telugu breaking news today): బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పరోక్షంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు పొరుగు దేశంలోని పరిస్థితులను ఉపయోగించుకుంటే చివరికి ఆ దేశమే బలహీనపడుతుందని అన్నారు. ఆయన ఏ దేశం పేరునూ ప్రస్తావించలేదు. అయితే బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఒక దేశంలోని పరిస్థితులను మరో దేశం ఆసరాగా చేసుకుని తమకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని అనుకుంటే అది వారిని అంతర్గతంగా, బాహ్యంగా బలహీనపరుస్తుంది. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడం సరైన చర్య కాదు. అక్కడ ప్రదర్శలు హింసాత్మకంగా మారితే.. మౌనంగా ఉండటం సరికాదు. అది విదేశాంగ విధాన వైఫల్యమే అవుతుందని ఎక్స్ వేదికగా అఖిలేశ్ పేర్కొన్నారు.

Also Read: కలకత్తా ట్రైనీ వైద్యురాలి ఘటనపై దర్యాప్తునకు దీదీ డెడ్‌లైన్

అంతకు ముందు చేసిన మరో పోస్టులో కూడా ఆయన బంగ్లాదేశ్ పేరును ప్రస్తావించారు. సరైందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే పలు సందర్భంల్లో వివిధ కారణాలతో అనేక దేశాల్లో హింసాత్మక విప్లవాలు, తిరుగుబాట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో ఆ దేశం మాత్రమే తిరిగి పుంజుకుంది. బంగ్లాదేశ్‌లో శాంతి స్ధాపనకు కేంద్రం కృషి చేయాలి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఈ అంశాన్ని భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తాలని అన్నారు. బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×