E-Paper
Advertisement

Amit Shah Speech: మోదీ 3.0 ఖాయం.. అమిత్ షా విశ్వాసం!

Amit Shah Speech: మోదీ 3.0 ఖాయం.. అమిత్ షా విశ్వాసం!
latest political news in India

Amit Shah Speech At BJP Convention: కేంద్రంలో మళ్లీ అధికారం తమదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ 3.0 ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో భారత మండపంలో బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మహాభారత యుద్ధంతో అమిత్ షా పోల్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు.. ఫ్యామిలీ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయని తెలిపారు. బీజేపీ గెలుపుపై ఎలాంటి అనుమానం లేదని అమిత్ షా స్పష్టంచేశారు. దేశంలో ఉగ్రవాదం , నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని వివరించారు. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటుతో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని తేల్చిచెప్పారు.

మోదీ పేద ప్రజలు, దేశాభివృద్ధి కోసం ఆలోచిస్తారని అమిత్ షా వ్యాఖ్యానించారు. విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తమ వారసులను సీఎం, పీఎంలను చేయాలన్న లక్ష్యంతో ఉన్నారని విమర్శించారు. అలాంటి విధానాలు బీజేపీలో ఉంటే చాయ్‌వాలా కుమారుడు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదన్నారు.

Read More: సీఎంలపై సర్వే.. పాపులర్ ముఖ్యమంత్రి ఎవరంటే?

మోదీ ఓటమి కోసం రాకుమారులంతా ఏకమయ్యారని విపక్ష నేతలపై అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పైనా విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే హస్తం పార్టీ రామమందిర ప్రాణప్రతిష్ఠకు రాలేదని మండిపడ్డారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×