BigTV English
Advertisement

Annamalai On Contesting Lok Sabha Polls: ఊహాగానాలకు స్పందించను.. పార్టీ ఏది చెబితే అది చేస్తా..

Annamalai On Contesting Lok Sabha Polls: ఊహాగానాలకు స్పందించను.. పార్టీ ఏది చెబితే అది చేస్తా..

Annamalai On Contesting Lok Sabha PollsAnnamalai On Contesting Lok Sabha Polls(Today latest news telugu): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని వస్తున్న వార్తలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై శుక్రవారం స్పందించారు. అవి కేవలం ఊహాగానాలేనని.. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.


తనకు ‘బీజేపీలో వ్యక్తిగత పక్షపాతం.. ఇష్టాలు, అయిష్టాలు లేవని అన్నామలై పేర్కొన్నారు. “పార్టీ నాకు ఏది చెప్పినా నేను పాటించాలి, అది పార్టీ స్వభావం. ఈ రోజు పార్టీ రాష్ట్ర స్థాయి యాత్ర (ఎన్ మన్నా ఎన్ మక్కల్) పూర్తి చేయాలని నన్ను కోరింది. మేము దానిని పూర్తి చేసాము” అని అన్నామలై విలేకరులతో అన్నారు.

రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల విషయంలో బీజేపీ తనకు కొంత బాధ్యతను అప్పగించిందని, తాను ఆ పని చేస్తున్నానని చెప్పారు.


Read More: PM Modi: సందేశ్‌ఖాలీ కేసు వివాదం.. టీఎంసీపై పీఎం మోదీ ఫైర్‌..

త్వరలో జరగనున్న లోక్‌సభ పోటీని ప్రస్తావిస్తూ.. ఒకవేళ పార్టీ అలా చేయమని చెబితే, చేస్తానని ఆయన అన్నారు.

“నేను ఊహాగానాలకు ప్రతిస్పందించాలని అనుకోవడం లేదు. మా సీనియర్ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పాటించడం, దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం నా కర్తవ్యం ” అని రాష్ట్ర బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలను కవర్ చేస్తూ అన్నామలై చేపట్టిన ‘ఎన్ మన్నా, ఎన్ మక్కల్’ పాదయాత్రను జూలై 28న రామేశ్వరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×