E-Paper
Advertisement

Internet Users in India : దేశంలో ఇంటర్నెట్ వాడనోళ్లు ఇంతమంది ఉన్నారా!

Internet Users in India : దేశంలో ఇంటర్నెట్ వాడనోళ్లు ఇంతమంది ఉన్నారా!
Advertisement

Internet

Internet Users in India : దేశంలో ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన పది సంవత్సరాలతో పోలిస్తే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో మొదట 2జీ నెట్‌వర్క్ ఉండేది. తర్వాత అది 3జీ అయింది. జియో రాకతో 4జీ వేగం గణనీయంగా పుంజుకుంది. ఇప్పుడు 5జీ సేవలు కూడా అందుబాటులొకి వచ్చాయి. ఈ ఏడాది కోట్లాది మంది టెలికాం వినియోగదారులు 4జీ నుంచి 5జీకి మారారు.

Advertisement

ఎందుకంటే వినియోగదారులు ఇప్పుడు 5జీతో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే 5జీ యుగంలో కూడా చాలా మంది ఇంటర్నెట్‌ను ఉపయోగింయడం లేదట. సగం మంది భారతీయులు ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నారట. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

Read More :  ఓరి దేవుడా!.. 28,000 mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ఇంత తక్కువ ధర

Advertisement

ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలో 45 శాతం జనాభాకు ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీనికి సంబంధించిన లెక్కలు చూస్తే.. 2023 నాటికి దేశంలో నివిసిస్తున్న జనాభాలో66.5 కోట్ల మందికి ఇంటర్నెట్ వాడటం లేదు.

ఇప్పుడు ఈ సంఖ్య సంఖ్య 45 శాతానికి చేరుకుంది. దేశంలోని 66.50 కోట్ల మంది యాక్టివ్‌గా లేని ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. కానీ గత మూడేళ్ల లెక్కలను చూస్తుంటే ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతోంది. యాక్టివ్‌గా లేని యూజర్ల సంఖ్య సంవత్సరానికి మూడు నుంచి నాలుగు శాతం తగ్గుతోంది.

Read More : ఎండ చంపేస్తుందా?.. 5జీ ఫోన్ రేటుకే ఏసీని కొనేయండి.. ఈ ఆఫర్ మీకోసమే.

ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలోని గ్రామాలలో నివసిస్తున్న దాదాపు సగం మంది ప్రజలు ఇంటర్నెట్‌ సేవలకు దూరంగా ఉన్నారు. ఇంటర్నెట్‌‌కు దూరంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  • ఇంటర్నెట్ వాడని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్నెట్ అర్థం చేసుకోవడం చాలా కష్టమని భావిస్తున్నారు.
  • వారిలో 22 శాతం మందికి ఇంటర్నెట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియదు.
  • ఇంటర్నెట్ వాడని వారిలో 22 శాతం మందికి ఇంటర్నెట్‌ని ఉపయోగించడంపై ఆసక్తి లేదు.
  • ఇంటర్నెట్ యూజర్లలో 21 శాతం మందికి ఇంటర్నెట్ ఉపయోగించడానికి పర్మిషన్ లేదు.
  • దేశంలో 17 శాతం మంది ప్రజలకు ఇంటర్నెట్ కొనుగోలు చేసే శక్తి లేదు.
  • 16 శాతం మంది ప్రజలు ఇంటర్నెట్ వాడటం చాలా గందరగోళంగా ఉంది.
  • కొందరికి మొబైల్ లేదా కంప్యూటర్ వంటి సొంత డివైస్ లేదు.
  • దేశ జనాభాలో 13 శాతం ప్రజలకు ఇంటర్నెర్ అవసరం లేదు

దేశంలోని యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజూ కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. 2023 నాటికి దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 800 మిలియన్లు అంటే 80 కోట్లు దాటింది. ఈ నివేదిక ప్రకారం 2023 నాటికి భారతదేశంలో 820 మిలియన్లు అంటే దాదాపు 82 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకుంటున్నారు.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×