E-Paper
Advertisement

Bridge Collapsed In Bihar: బీహార్‌లో కూలిన మరో వంతెన.. 16 రోజుల్లో 10వ సంఘటన..

Bridge Collapsed In Bihar: బీహార్‌లో కూలిన మరో వంతెన.. 16 రోజుల్లో 10వ సంఘటన..
Advertisement

Another Bridge Collapsed In Bihar: బీహార్‌లో వంతెనలు కూలిపోవడం షరా మామూల్ అయ్యింది. బీహార్‌లోని సరన్ జిల్లాలో ఇవాళ మరో వంతెన కూలిపోయింది. కాగా గత 24 గంటల్లో సరన్ జిల్లాలో ఇది రెండో సంఘటన. అటు గత పక్షం రోజుల్లో బీహార్‌లో 10 వంతెనలు కూలిపోయాయి.

గురువారం సరన్ జిల్లాలోని గండకీ నదిపై బనేయపూర్, జిల్లాలోని ఇతర ప్రాంతాలను కలిపే వంతెన కూలిపోయింది. కాగా ఈ బ్రిడ్జ్ 15 ఏళ్ల క్రితం నిర్మించారని అధికారులు పేర్కొన్నారు. అయితే వంతెన కూలిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇటు బుధవారం రోజున సరన్ జిల్లాలోని జంటా బజార్, లహల్దాపూర్‌ ప్రాంతాల్లో రెండు వంతెనలు కూలిపోయాయి.

Advertisement

సరన్ జిల్లాలో చిన్న వంతెనలు కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు డీఎం తెలిపారు. స్థానికులు మాత్రం గత కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న వంతెనలు కూలిపోయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గత పక్షం రోజుల్లో సివాన్, సరన్, మధుబని, అరారియా, ఈస్ట్ చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లో మొత్తం 10 వంతెనలు కూలిపోయాయి.

Also Read: వారంలో మూడో బ్రిడ్జ్.. వరుసగా కుప్పకూలుతున్న వంతెనలు.. బీహార్‌లో మరో వంతెన..

Advertisement

రాష్ట్రంలోని పాత వంతెనలన్నింటిపై సర్వే నిర్వహించి తక్షణ మరమ్మత్తులు అవసరమయ్యే వాటిని గుర్తించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశించిన మరుసటి రోజే తాజా ఘటన చోటుచేసుకుంది.

వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో.. బీహార్ రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన. నిర్మాణంలో ఉన్న, పాత వంతెనల నిర్మానాలకు సంబంధించి ఆడిట్ కోరుతూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు అడ్వకేట్ బ్రజేశ్ సింగ్. బీహార్‌లో గత రెండేళ్లలో నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన వంతెనలు, అనేక ఇతర వంతెనలు కూలిన సంఘటనలు జరిగినందున తక్షణ సమస్యను సుప్రీం కోర్టు అత్యవసరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయవాది బ్రజేష్ సింగ్ దాఖలు చేసిన పిల్ పేర్కొంది.

అన్ని వంతెనలను నిరంతరం పర్యవేక్షించడం కోసం, సమగ్ర డేటాబేస్ నిర్వహించడం కోసం ఉన్నత స్థాయి నిపుణులతో శాశ్వత సంస్థను ఏర్పాటు చేయడానికి కోర్టు బీహార్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది కోరారు.

Tags

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×