BigTV English

Old Age Home Atrocity: దుస్తులు లేవు, చేతులు కాళ్లకు బేడీలు.. వృద్ధాశ్రమంలో దారుణ స్థితిలో 39 మంది

Old Age Home Atrocity: దుస్తులు లేవు, చేతులు కాళ్లకు బేడీలు.. వృద్ధాశ్రమంలో దారుణ స్థితిలో 39 మంది

Old Age Home Atrocity| సమాజానికి భారంగా మారిన వారు, కుటుంబసభ్యులు వెలివేసిన వారు వృద్ధాశ్రమంలో శరణు పొందుతారు. అలాంటి ఒక వృద్ధాశ్రమంలో ఆ అనాథల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. తమకంటూ ఎవరూ లేని ఆ వృద్ధులను చేతులు, కాళ్లకు బేడీలు వేసి గదులలో బంధించారు. కొందరికి ఒంటిపై బట్టలు కూడా లేవు. మరికొందరైతే చాలీచాలని, చిరిగిన బట్టల్లో ఉన్నారు. వారు వేసుకున్న బట్టల్లోనే మల మూత్ర విసర్జనలు కూడా చేసి ఉన్నారు. ఇంతటి దయనీయ స్థితిలో ఆకలితో అలమటిస్తూ ఉండగా.. వారిని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో జరిగింది.


ఢిల్లీ సమీపంలోని నోయిడా సెక్టార్ 55లోని ఆనంద్ నికేతన్ వృద్ధాశ్రమంలో అనాథ వృద్ధులు దయనీయ స్థితిలో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆశ్రమంలో వృద్ధులను గదుల్లో బంధించడం, సరైన సిబ్బంది లేకపోవడం, కొందరు మూత్రం, మలంతో తడిసిన బట్టలతో ఉండటం, మరికొందరినైతే బట్టలు లేకుండా గదుల్లో పెట్టి బంధించారు. ఈ దారుణ పరిస్థితులను చూపే ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను లక్నో సామాజిక సంక్షేమ శాఖకు కూడా పంపారు. వీడియోలో ఒక వృద్ధ మహిళ చేతులు వేసి.. ఒక గదిలో నిర్బంధించి కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్, నోయిడా పోలీసులు ఆశ్రమంపై దాడి చేసి 39 మంది వృద్ధులను రక్షించారు.

అధికారులు ఆశ్రమానికి చేరుకున్నప్పుడు, చాలా మంది వృద్ధులు తమ బట్టలతో కట్టివేయబడి, గదుల్లో బంధించబడి ఉన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మీనాక్షి భరాలా మాట్లాడుతూ.. కొంతమంది వృద్ధ పురుషులను బేస్‌మెంట్ లాంటి గదుల్లో బంధించారని తెలిపారు. చాలా మంది వృద్ధ పురుషులు బట్టలు లేకుండా ఉండగా.. మహిళలకు పాక్షికంగా బట్టలు ఇవ్వబడ్డాయి. చాలా మంది వృద్ధుల బట్టలు మూత్రం లేదా మలంతో తడిసి ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆమె “నరకం కంటే దారుణం” అని వర్ణించారు. దాడి సమయంలో ఒక వృద్ధ మహిళ చేతులు కట్టివేయబడి ఉంది. చాలా మంది వృద్ధ పురుషులు బట్టలు లేకుండా, సరైన సంరక్షణ లేకుండా కనిపించారు.


సిబ్బంది లోపం
ఆశ్రమంలో వృద్ధుల సంరక్షణ కోసం సరైన సిబ్బంది లేరని అధికారులు గుర్తించారు. ఆనంద్ నికేతన్ ట్రస్టీ నీలేమ్మ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. ఒక వృద్ధ మహిళను కట్టివేసిన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించామనితెలిపారు. ఆ వృద్ధ మహిళ మానసికంగా అస్థిరంగా ఉందని, స్వీయ హాని నివారించడానికి ఆమెను కట్టివేయడం జరిగిందని చెప్పారు. అయితే, వైరల్ వీడియో, ఆకస్మిక తనిఖీల వెనుక వ్యక్తిగత కక్ష సాధింపు ఉందని ఆమె ఆరోపించారు. ఆశ్రమంలో ఒక ఉద్యోగి తనను నర్సుగా చెప్పుకుంది. కానీ ఆమె కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదివినట్లు తెలిసింది.

ప్రాథమిక విచారణలో.. ఆశ్రమం వృద్ధుల కుటుంబాల నుండి రూ. 2.5 లక్షల విరాళం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాక, ఆహారం మరియు వసతి కోసం నెలకు రూ. 6,000 వసూలు చేస్తున్నారు. ఈ ఆశ్రమంపై కేసు నమోదు చేయబడింది. వృద్ధులను కొద్ది రోజుల్లో ప్రభుత్వ వృద్ధాశ్రమానికి తరలించనున్నారు. ఆనంద్ నికేతన్ వృద్ధాశ్రమంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది.

ఈ ఘటన వృద్ధుల సంరక్షణలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. వృద్ధాశ్రమాలలో సరైన సౌకర్యాలు, శిక్షణ పొందిన సిబ్బంది, మానవీయ విధానం అవసరమని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. అధికారులు ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుని, వృద్ధుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నారు.

Related News

Food culture: ఆ రాష్ట్రంలో మటన్, చికెన్ తెగ తినేశారు.. ఒక్క రోజులో అన్ని కోట్ల వ్యాపారమా!

Viksit Bharat Rozgaar Yojna: యువత కోసం కేంద్రం కొత్త స్కీమ్.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రకటన

Independence Day 2025: ఎర్రకోటపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సోషల్ మీడియాపై దృష్టి

Jammu Kashmir cloudburst: జమ్మూ కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. 38 మంది మృతి.. 200 మంది గల్లంతు!

Dog population: వీధి కుక్కలు ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని?

Himachal floods: హిమాచల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వంతెనలు

Big Stories

×