BigTV English

Kedarnath : కేదార్‌నాథ్‌ లో ప్రతికూల వాతావరణం .. యాత్రికులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత..

Kedarnath : కేదార్‌నాథ్‌ లో ప్రతికూల వాతావరణం .. యాత్రికులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత..

Kedarnath : కేదార్‌నాథ్‌ యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గఢ్‌వాల్‌ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు హిమపాతం పేరుకుపోయింది. ప్రతికూలవాతావరణ పరిస్థితుల కారణంగా రిషికేశ్‌, హరిద్వార్‌లలో యాత్రికులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఏప్రిల్‌ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించిన తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరించారు.


మంగళవారం నుంచి కేదార్‌నాథ్‌ ధామ్‌ తెరుచుకోనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసుకున్న భక్తులు తగిన జాగ్రత్తలతో చార్‌ధామ్‌ యాత్రకు రావాలని అధికారులు సూచించారు. వెచ్చదనాన్నిచ్చే దుస్తులను తప్పనిసరిగా తెచ్చుకోవాలని స్పష్టం చేశారు.

మరోవైపు సెల్ఫీ పిచ్చి కేదార్‌నాథ్‌లో ఓ ప్రభుత్వ అధికారి ప్రాణం తీసింది. కేదార్‌నాథ్‌ ధామ్‌ హెలీప్యాడ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఉత్తరాఖండ్‌ పౌర విమానయాన అభివృద్ధి ప్రాధికార సంస్థలో ఫైనాన్స్‌ కంట్రోలర్‌గా పనిచేస్తున్న జితేంద్ర కుమార్‌ సైనీ ఆదివారం హెలీకాప్టర్‌తో సెల్ఫీ తీసుకునేందుకు దగ్గరగా వెళ్లారు. అయితే హెలీకాప్టర్‌ తోక భాగంలోని రెక్కలు తగిలి సైనీ తీవ్రగాయపడ్డారు. వెంటనే ప్రాణాలు కోల్పోయారు.


Related News

Jammu Kashmir cloudburst: జమ్మూ కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. 38 మంది మృతి.. 200 మంది గల్లంతు!

Dog population: వీధి కుక్కలు ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని?

Himachal floods: హిమాచల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వంతెనలు

Delhi Rains: దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Aadhar – Pan Cards: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ.. దానికి పనికి రావు

Minta Devi Bihar: పార్లమెంట్ లో రచ్చరేగిన..124 ఏళ్ల ఓటరు ఎక్కడ?.. ఆమె మాట ఇదే!

Big Stories

×