E-Paper
Advertisement

Kedarnath : కేదార్‌నాథ్‌ లో ప్రతికూల వాతావరణం .. యాత్రికులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత..

Kedarnath : కేదార్‌నాథ్‌ లో ప్రతికూల వాతావరణం .. యాత్రికులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత..
Advertisement

Kedarnath : కేదార్‌నాథ్‌ యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గఢ్‌వాల్‌ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు హిమపాతం పేరుకుపోయింది. ప్రతికూలవాతావరణ పరిస్థితుల కారణంగా రిషికేశ్‌, హరిద్వార్‌లలో యాత్రికులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఏప్రిల్‌ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించిన తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరించారు.

మంగళవారం నుంచి కేదార్‌నాథ్‌ ధామ్‌ తెరుచుకోనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసుకున్న భక్తులు తగిన జాగ్రత్తలతో చార్‌ధామ్‌ యాత్రకు రావాలని అధికారులు సూచించారు. వెచ్చదనాన్నిచ్చే దుస్తులను తప్పనిసరిగా తెచ్చుకోవాలని స్పష్టం చేశారు.

Advertisement

మరోవైపు సెల్ఫీ పిచ్చి కేదార్‌నాథ్‌లో ఓ ప్రభుత్వ అధికారి ప్రాణం తీసింది. కేదార్‌నాథ్‌ ధామ్‌ హెలీప్యాడ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఉత్తరాఖండ్‌ పౌర విమానయాన అభివృద్ధి ప్రాధికార సంస్థలో ఫైనాన్స్‌ కంట్రోలర్‌గా పనిచేస్తున్న జితేంద్ర కుమార్‌ సైనీ ఆదివారం హెలీకాప్టర్‌తో సెల్ఫీ తీసుకునేందుకు దగ్గరగా వెళ్లారు. అయితే హెలీకాప్టర్‌ తోక భాగంలోని రెక్కలు తగిలి సైనీ తీవ్రగాయపడ్డారు. వెంటనే ప్రాణాలు కోల్పోయారు.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×