E-Paper
Advertisement

Ajit Pawar: పైలట్ల తప్పిదమా? సాంకేతిక లోపమా.. ప్రమాదానికి ముందు ఏమైంది?

Ajit Pawar: పైలట్ల తప్పిదమా? సాంకేతిక లోపమా.. ప్రమాదానికి ముందు ఏమైంది?
Advertisement

Ajit Pawar:  బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన పైలట్లకు సంబంధించిన వివరాలు అధికారిక నివేదికల ప్రకారం చూస్తే.. ఈ ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వారి పేర్లు పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్ కాగా.. ఫస్ట్ ఆఫీసర్ శాంభవీ పాఠక్.

పైలట్ల అనుభవం , సామర్థ్యం ఎలాంటిదో చూస్తే.. ఈ విమానాన్ని ఆపరేట్ చేసిన VSR ఏవియేషన్ సంస్థకు చార్టర్డ్ సర్వీసెస్‌లో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ సంస్థలో సుమారు 60 మందికి పైగా అనుభవజ్ఞులైన పైలట్లు ఉన్నారు.

Advertisement

ఇక వీరు నడుపుతున్న లియర్ జెట్ 45 అనేది అత్యంత వేగవంతమైన, అత్యాధునిక ట్విన్-ఇంజిన్ బిజినెస్ జెట్. దీన్ని నడపడానికి పైలట్లకు ప్రత్యేక శిక్షణ, నిర్ణీత గంటల ఎగిరిన అనుభవం అవసరం.

ప్రమాదానికి ముందు పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విమానం రన్‌వేపై దిగే సమయంలో పరిస్థితి చేయి దాటిపోయిందనీ.. నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు.

Advertisement

ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు విమానంలోని బ్లాక్ బాక్స్ ద్వారా పైలట్లకు, ఏటీసీకి మధ్య జరిగిన చివరి సంభాషణలను ఎనలైజ్ చేస్తున్నారు. ఈ విచారణ పూర్తయితేనే పైలట్ల పొరబాటు లేదా సాంకేతిక లోపం వంటి సమస్యలపై ఒక క్లారిటీ వచ్చేలా తెలుస్తోంది.

ALSO READ: వాట్సాప్‌లో కొత్త ‘లాక్‌డౌన్’ ఫీచర్.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చుకోకుంటే మీ అకౌంట్ రిస్క్‌లో పడ్డట్టే!

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×