Ajit Pawar: బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన పైలట్లకు సంబంధించిన వివరాలు అధికారిక నివేదికల ప్రకారం చూస్తే.. ఈ ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వారి పేర్లు పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్ కాగా.. ఫస్ట్ ఆఫీసర్ శాంభవీ పాఠక్.
పైలట్ల అనుభవం , సామర్థ్యం ఎలాంటిదో చూస్తే.. ఈ విమానాన్ని ఆపరేట్ చేసిన VSR ఏవియేషన్ సంస్థకు చార్టర్డ్ సర్వీసెస్లో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ సంస్థలో సుమారు 60 మందికి పైగా అనుభవజ్ఞులైన పైలట్లు ఉన్నారు.
ఇక వీరు నడుపుతున్న లియర్ జెట్ 45 అనేది అత్యంత వేగవంతమైన, అత్యాధునిక ట్విన్-ఇంజిన్ బిజినెస్ జెట్. దీన్ని నడపడానికి పైలట్లకు ప్రత్యేక శిక్షణ, నిర్ణీత గంటల ఎగిరిన అనుభవం అవసరం.
ప్రమాదానికి ముందు పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విమానం రన్వేపై దిగే సమయంలో పరిస్థితి చేయి దాటిపోయిందనీ.. నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు.
ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు విమానంలోని బ్లాక్ బాక్స్ ద్వారా పైలట్లకు, ఏటీసీకి మధ్య జరిగిన చివరి సంభాషణలను ఎనలైజ్ చేస్తున్నారు. ఈ విచారణ పూర్తయితేనే పైలట్ల పొరబాటు లేదా సాంకేతిక లోపం వంటి సమస్యలపై ఒక క్లారిటీ వచ్చేలా తెలుస్తోంది.
ALSO READ: వాట్సాప్లో కొత్త ‘లాక్డౌన్’ ఫీచర్.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చుకోకుంటే మీ అకౌంట్ రిస్క్లో పడ్డట్టే!