BigTV English

Bengaluru Cafe Blast: బాంబ్ బ్లాస్ట్ నిందితుల మాస్టర్ ప్లాన్స్.. ఎలా తప్పించుకు తిరిగారో చూడండి(VIDEO)

Bengaluru Cafe Blast: బాంబ్ బ్లాస్ట్ నిందితుల మాస్టర్ ప్లాన్స్.. ఎలా తప్పించుకు తిరిగారో చూడండి(VIDEO)

Bengaluru Cafe Blast: బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితులను ఎన్ఐఏ అధికారులు గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారు ఇన్ని రోజులు ఎన్ఐఏ, పోలీసులు కల్లుగప్పి ఎలా తప్పించుకుని తిరిగారనే విషయాన్ని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు.


రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందుతులైన అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ లను ఎన్ఐఏ అధికారులు కోల్ కతాలోని ఇక్బాల్ పూర్ ఏరియాలోని డ్రీమ్ గెస్ట్ హౌస్ లో అరెస్ట్ చేశారు. అయితే ఆ నిందితులు ఎన్ఐఏ అధికారు చేతికి చిక్కే వరకు వేర్వేరు రాష్ట్రాల్లో పలు మకాంలు మారుస్తూ తప్పించుకుని తిరిగినట్లు వారు వెల్లడించారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులకు నిందితులకు సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ లు లభ్యమయ్యాయి. వాటికి సంబంధించిన కొన్ని వీడియోలను ఎన్ఐఏ అధికారులు విడుదల చేశారు. నిందితులు కోల్ కతాలోని డ్రీమ్ గెస్ట్ హౌస్ లో మార్చి 25 నుంచి 28వ తేదీ వరకు మకాం వేసినట్లు వారు గుర్తించారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి మిడ్నాపుర్ కు వెళ్లినట్లు తెలిపారు.


నిందితులు వేరే వేరు ఐడీలు, గుర్తింపు కార్డులు ఉపయోగించి పలు ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. వీరు ఎక్కడ కూడా ఆన్ లైన్ ద్వారా, ఏటీఎం కార్డుల ద్వారా నగదును బదిలీ చేయలేదని.. ప్రతి దగ్గరా డబ్బులను నేరుగానే అందజేసినట్లు గుర్తించారు. దీనికోసం వీరు ముందుగానే అన్నీ సిద్ధం చేసిన్నారని తెలిపారు.

Also Read: మరో 3 స్లాట్లు రెడీ చేయండి.. మండోలి జైలు నుంచి సుకేశ్ లేఖ

మార్చి 1వ తేదీన రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ జరగగా.. ఈ కేసును ఎన్ఐఏ మార్చి 3న టేకాప్ చేసింది. దీంతో ఈ కేసును టేకప్ చేసిన నుంచి ఎన్ఐఏ అధికారులు కర్ణాటక, తమిళనాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చివరికి వారు పశ్చిమబెంగాల్ రాజధాని కోలకతాకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పట్టణంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పరచగా.. కోర్టు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించింది.

Tags

Related News

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Big Stories

×