BigTV English

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Bengaluru Traffic Jam: గత కొద్ది రోజులుగా బెంగళూరులో కురుస్తున్న ఎడతెరపి వర్షాలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి రోజూ కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్ల మీదే ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. బుధవారం నాడు కురిసిన భారీ వర్షాలు బెంగళూరు వాసులకు ప్రత్యక్ష నరకం చూపించాయి. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టెక్ సంస్థల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చే సమయంలో ఈ ట్రాఫిక్ జాయ్ ఏర్పడ్డంతో గంటల తరబడి వాహనదారులు రోడ్ల మీదే నిలిచిపోయారు. ఎంతకీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో చాలా మంది టెక్కీలు తమ కార్లను రోడ్లమీదే వదిలేసి వెళ్లిపోయారు.


ట్రాఫిక్ కష్టాలకు కేరాఫ్ బెంగళూరు

భారత్ లో అత్యంత ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొనే నగరం అనగానే బెంగళూరు గుర్తొస్తుంది. కొద్ది దూరం ప్రయాణించాలన్నా ముప్పుతిప్పలు పడాల్సి ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ప్రయాణం బెంగళూరు వాసులకు కొత్తేమీ కాదు. సాధారణ సమయాల్లోనే ట్రాఫిక్ కష్టాలు ఉంటాయంటే, కాస్త వాన పడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నగరం అంతా ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. కీలో మీటరు ప్రయాణించాలంటే గంటలు తరబడి రోడ్ల మీద పడిగాపుడు కాయాల్సి వస్తుంది. తాజాగా బెంగళూరులో అలాంటి దారుణ పరిస్థితి తలెత్తింది. బుధవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్ మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టెక్కీలు తమ ఆఫీస్ ముగించుకుని వచ్చే సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 3 గంటలకు పైగా ప్లై ఓవర్ మీదే వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసి చిరాకేసి చాలా మంది టెక్కీలు తమ కార్లను రోడ్డు మీదే వదిలేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో బెంగళూరు ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా నరకంగా అనిపిస్తుందంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

కర్ణాటక రాజధానిలో భారీ వర్షం, ఐదురుగు మృతి

గత వారం రోజులుగా బెంగళూరులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. పలు కాలనీలు నీట మునిగాయి. సిటీలోని చాలా రోడ్లు నదులను తలపిస్తున్నాయి.  చాలా ప్రాంతాల్లో కార్లు, ఇతర వాహనాలు నీళ్లలో మునిగిపోయి. వరదల్లోనే నగరవాసులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకు సుమారు 8 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో చాలా మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Read Also: బెంగళూరులో భారీ వర్షం.. కుప్పకూలిన భారీ భవనం.. ఒకరు మృతి

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×