E-Paper
Advertisement

9 devotees electrocuted in Bihar: బీహార్‌లో ఘోరం.. వాహనానికి విద్యుత్ వైర్లు తగిలి 9 మంది మృతి

9 devotees electrocuted in Bihar: బీహార్‌లో ఘోరం.. వాహనానికి విద్యుత్ వైర్లు తగిలి 9 మంది మృతి

9 devotees electrocuted in Bihar(National news today India): బీహార్‌లో ఘోరం జరిగింది. కావడి యాత్రికులు ప్రయాణిస్తున్న మినీ ట్రక్కుకు హైటెన్షన్ విద్యుత్‌ వైరు తగిలాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో ఆరుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. హాజీపూర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా సుల్తాన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఇంకో లోతుల్లోకి వెళ్తే.. హాజీపూర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొంతమంది యాత్రికులు సోన్‌పూర్‌లో బాబా ఆలయానికి వెళ్తున్నారు. అర్థరాత్రి సమయంలో మినీ ట్రక్కులో యాత్రికులు పమెల్జా నుంచి గంగా జలాన్ని తీసుకెళ్తున్నారు. అందులో డీజేని కూడా తీసుకె ళ్లారు. అయితే డీజే వద్దని.. వైర్లు తగులుతాయని కొందరు చెప్పారు. ఏం పర్వాలేదని మరికొందరు వారించారు.

చివరకు డీజే ఎత్తు పొడవుగా ఉండడంతో హైఓల్టేజీ విద్యుత్ వైర్లకు తగిలాయి. స్పాట్‌లో 8 మంది మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడినవారిలో ఆరుగురు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనలో పోలీసులు నోరు విప్పారు.

ALSO READ:  బీహార్ సీఎం కావాలంటే టెన్త్ పాసవ్వాలట..పీకే చెబుతున్న మాట

కావడి యాత్రికులు ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, ఆ డీజీకి 11 వేల వోల్టల విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదంగా మారింది. మరోవైపు స్థానికులు విద్యుత్ శాఖ అధికారులపై మండిపడుతున్నారు. పదేపదే ఫోన్ చేసినప్పటికీ, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, ఫలితంగా తొమ్మిది మంది మృతి చెందారని అంటున్నారు. దీనికి కారణం ముమ్మాటికీ విద్యుత్ శాఖ అధికారులేనని అంటున్నారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×