BigTV English

9 devotees electrocuted in Bihar: బీహార్‌లో ఘోరం.. వాహనానికి విద్యుత్ వైర్లు తగిలి 9 మంది మృతి

9 devotees electrocuted in Bihar: బీహార్‌లో ఘోరం.. వాహనానికి విద్యుత్ వైర్లు తగిలి 9 మంది మృతి

9 devotees electrocuted in Bihar(National news today India): బీహార్‌లో ఘోరం జరిగింది. కావడి యాత్రికులు ప్రయాణిస్తున్న మినీ ట్రక్కుకు హైటెన్షన్ విద్యుత్‌ వైరు తగిలాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో ఆరుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. హాజీపూర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా సుల్తాన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.


అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఇంకో లోతుల్లోకి వెళ్తే.. హాజీపూర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొంతమంది యాత్రికులు సోన్‌పూర్‌లో బాబా ఆలయానికి వెళ్తున్నారు. అర్థరాత్రి సమయంలో మినీ ట్రక్కులో యాత్రికులు పమెల్జా నుంచి గంగా జలాన్ని తీసుకెళ్తున్నారు. అందులో డీజేని కూడా తీసుకె ళ్లారు. అయితే డీజే వద్దని.. వైర్లు తగులుతాయని కొందరు చెప్పారు. ఏం పర్వాలేదని మరికొందరు వారించారు.

చివరకు డీజే ఎత్తు పొడవుగా ఉండడంతో హైఓల్టేజీ విద్యుత్ వైర్లకు తగిలాయి. స్పాట్‌లో 8 మంది మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడినవారిలో ఆరుగురు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనలో పోలీసులు నోరు విప్పారు.


ALSO READ:  బీహార్ సీఎం కావాలంటే టెన్త్ పాసవ్వాలట..పీకే చెబుతున్న మాట

కావడి యాత్రికులు ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, ఆ డీజీకి 11 వేల వోల్టల విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదంగా మారింది. మరోవైపు స్థానికులు విద్యుత్ శాఖ అధికారులపై మండిపడుతున్నారు. పదేపదే ఫోన్ చేసినప్పటికీ, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, ఫలితంగా తొమ్మిది మంది మృతి చెందారని అంటున్నారు. దీనికి కారణం ముమ్మాటికీ విద్యుత్ శాఖ అధికారులేనని అంటున్నారు.

Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×