E-Paper
Advertisement

CM Revanthreddy meeting with NRIs: అమెరికా , ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్‌‌ భేటీ, చంద్రబాబు పాలనలో

CM Revanthreddy meeting with NRIs: అమెరికా , ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్‌‌ భేటీ, చంద్రబాబు పాలనలో

CM Revanth reddy meeting with NRIs(Telangana congress news today): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావర ణం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలంటే ప్రవాస భారతీయులు తమవంతు సాయం చేయాలన్నారు. పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలను ప్రొత్సహించా లన్నారు. ఆ ఆలోచనలో అమెరికాకు వచ్చామన్నారు సీఎం. అమెరికా ఆర్థిక వ్యవస్థను భారతీయులు డిక్టేట్ చేసే స్థాయికి చేరుకున్నారన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు, చేయబోతున్న ప్రణాళిక లను ఎన్నారైలకు వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని గుర్తు చేశారు. అమెరికాలోకి న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌‌లో ఎన్నారైల పారిశ్రామిక‌వేత్తలతో సమావేశం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రులు తెలంగాణపై దృష్టి పెట్టడమే దీనికి కారణమన్నారు.

హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అప్పటి సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి పునాది వేశారని, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందన్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబు పాలనలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందన్నారు. సిద్ధాంతపరంగా భిన్నాభిప్రాయాలు వున్నా, ఏకాభ్రిప్రాయంతో ముందుకెళ్లామన్నారు సీఎం రేవంత్‌‌రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రచించి ముందుకెళ్తున్నామన్నారు. ఈ విషయంలో అనుమానాలు అపోహాలను తొలగించాలన్నారు. హైదరాబాద్ నగరానికి మెరుగైన స్థానం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ALSO READ:  మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి: భట్టి

ఇదే క్రమంలో అన్నీ ఉచితంగా ఇస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బ దింటుందని చాలామంది భావిస్తున్నారని  అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అనుచితంగా ఉచితం ఇవ్వడం తప్పన్నారు. అర్హత లేనివారికి ఉచితం ఇవ్వడం తప్పన్నారు. ఆర్థికంగా వెనుబడిన వర్గాలవారిని ఆదుకోవడానికి ప్రజా ప్రభుత్వం ఉందన్నారు.

CM Revanthreddy meeting with NRIs
CM Revanthreddy meeting with NRIs

ఆర్టీసీలో మహిళలకు ఉచితం ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించామన్నారు సీఎం. పేదవాడికి 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఆదాయం పెంచాలనే ప్రాధాన్యతలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అందరికీ ఒకటే విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు అందరూ సహకరించాలన్నారు. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేశామని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

 

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×