E-Paper
Advertisement

CM Revanthreddy meeting with NRIs: అమెరికా , ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్‌‌ భేటీ, చంద్రబాబు పాలనలో

CM Revanthreddy meeting with NRIs: అమెరికా , ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్‌‌ భేటీ, చంద్రబాబు పాలనలో
Advertisement

CM Revanth reddy meeting with NRIs(Telangana congress news today): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావర ణం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలంటే ప్రవాస భారతీయులు తమవంతు సాయం చేయాలన్నారు. పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలను ప్రొత్సహించా లన్నారు. ఆ ఆలోచనలో అమెరికాకు వచ్చామన్నారు సీఎం. అమెరికా ఆర్థిక వ్యవస్థను భారతీయులు డిక్టేట్ చేసే స్థాయికి చేరుకున్నారన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు, చేయబోతున్న ప్రణాళిక లను ఎన్నారైలకు వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని గుర్తు చేశారు. అమెరికాలోకి న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌‌లో ఎన్నారైల పారిశ్రామిక‌వేత్తలతో సమావేశం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రులు తెలంగాణపై దృష్టి పెట్టడమే దీనికి కారణమన్నారు.

Advertisement

హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అప్పటి సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి పునాది వేశారని, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందన్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబు పాలనలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందన్నారు. సిద్ధాంతపరంగా భిన్నాభిప్రాయాలు వున్నా, ఏకాభ్రిప్రాయంతో ముందుకెళ్లామన్నారు సీఎం రేవంత్‌‌రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రచించి ముందుకెళ్తున్నామన్నారు. ఈ విషయంలో అనుమానాలు అపోహాలను తొలగించాలన్నారు. హైదరాబాద్ నగరానికి మెరుగైన స్థానం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ALSO READ:  మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి: భట్టి

Advertisement

ఇదే క్రమంలో అన్నీ ఉచితంగా ఇస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బ దింటుందని చాలామంది భావిస్తున్నారని  అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అనుచితంగా ఉచితం ఇవ్వడం తప్పన్నారు. అర్హత లేనివారికి ఉచితం ఇవ్వడం తప్పన్నారు. ఆర్థికంగా వెనుబడిన వర్గాలవారిని ఆదుకోవడానికి ప్రజా ప్రభుత్వం ఉందన్నారు.

CM Revanthreddy meeting with NRIs
CM Revanthreddy meeting with NRIs

ఆర్టీసీలో మహిళలకు ఉచితం ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించామన్నారు సీఎం. పేదవాడికి 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఆదాయం పెంచాలనే ప్రాధాన్యతలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అందరికీ ఒకటే విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు అందరూ సహకరించాలన్నారు. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేశామని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×