E-Paper
Advertisement

Bijapur Encounter: బీజాపూర్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. 18కి చేరిన మృతులు

Bijapur Encounter: బీజాపూర్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. 18కి చేరిన మృతులు
Advertisement

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బుధవారం ప్రారంభమైన భారీ స్థాయి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని పోలీసులు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు మొత్తం 18 మంది మావోయిస్టులు ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందగా, భద్రతా దళాలకు కూడా భారీ నష్టం సంభవించింది. ముగ్గురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారాన్ని అందుకున్న అనంతరం.. జిల్లా డీఆర్‌జీ బీజాపూర్ తో పాటు ఇతర కేంద్ర బలగాలు కలిసి భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా రెండు వైపుల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి.

Advertisement

మొదటి దశ ఎదురుకాల్పుల్లోనే 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలపై మావోయిస్టులు ఆటోమేటిక్ ఆయుధాలతో తీవ్రంగా కాల్పులు జరిపారు. ప్రతిగా జవాన్లు కూడా ధీటుగా ఎదుర్కొనడంతో ఈ ఘర్షణ గంటల తరబడి సాగింది. ఈ సమయంలో ముగ్గురు జవాన్లు మావోయిస్టులకు ఎదురొడ్డి పోరాడుతూ వీరమరణం పొందారు. అమరవీరులుగా హెడ్ కానిస్టేబుల్ మోను మోహన్ బడ్డీ, కానిస్టేబుల్ డుకారు గొండే, జవాన్ రమేష్ సోడి పేర్లను అధికారులు ప్రకటించారు. వీరి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరువదని అధికారులు నివాళులు అర్పించారు.

ఇంకా ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడగా, వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం కూడా బీజాపూర్ అడవుల్లో కాల్పుల ముప్పు కొనసాగుతుందని భావించిన అధికారులు, భారీగా అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించారు.

Advertisement

ఈరోజు ఉదయం మళ్లీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగగా, మరోసారి మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఈ తాజా ఎదురుకాల్పుల్లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 16కి చేరిందని మొదట ప్రకటించగా, అనంతరం ఇంకా రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 18 మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఖరారైంది.

ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో PLGA బెటాలియన్ కు చెందిన కీలక సభ్యుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నక్సలైట్‌పై రూ.8 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఇది మావోయిస్టు నెట్‌వర్క్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, గుండ్లు, పేలుడు పదార్థాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Also Read: వార్తల్లో రేణుకా చౌదరి.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు? మేటర్.. ఆ విషయంపై

ప్రస్తుతం బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలు పూర్తిస్థాయి కాంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఎక్కడైనా మావోయిస్టులు తప్పించుకుని ఉండవచ్చని భావించి, పరిసర గ్రామాలు, అటవీ ప్రాంతాలను చుట్టుముట్టి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో కూడా అడవులను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికులకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని, ప్రజలు భద్రతా బలగాలకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

 

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×