Bijapur Encounter: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవీ ప్రాంతంలో.. మావోయిస్టుల కదలికలపై ముందస్తు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. బుధవారం ఉదయం ప్రత్యేక తనిఖీ ఆపరేషన్ను ప్రారంభించాయి. అడవుల్లో అకస్మాత్తుగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని, ప్రతిగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులు గంటలపాటు కొనసాగినట్లు సమాచారం.
ఎన్కౌంటర్ అనంతరం సంఘటనా స్థలంలో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయని, అవన్నీ మావోయిస్టులవేనని అధికారులు తెలిపారు. మృతుల వద్ద నుంచి ఆటోమేటిక్ తుపాకులు, పలు పేలుడు పదార్థాలు, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఎన్కౌంటర్ జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించారు. అటవీ ప్రాంతమంతా భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నాయి. మృతిచెందిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
Also Read: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. రాజ్ భవన్ పేరును లోక్భవన్గా మార్పు
ఎన్కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు. మరోవైపు ఈ ఘటనతో బీజాపూర్ జిల్లాలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.