E-Paper
Advertisement

Ratan Tata Request: నెటిజన్లకు రతన్ టాటా రిక్వెస్ట్.. “ప్లీజ్ దానిని కాపాడండి”..!

Ratan Tata Request: నెటిజన్లకు రతన్ టాటా రిక్వెస్ట్.. “ప్లీజ్ దానిని కాపాడండి”..!
Advertisement

Ratan Tata Urgent Request to Netizens: రతన్ టాటా. పరిచయం అక్కర్లేని వారిలో ఈయన ఒకరు. ప్రపంచ బిలీనియర్లలోనే కాదు.. ఎంతో మందికి సహాయం చేయడంలోనూ ముందుంటారాయన. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ఆదుకుంటారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు ముంబై వాసులను సహాయం చేయండని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ వీధిశునకం ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయండని రిక్వెస్ట్ చేశారు.

ఇప్పుడున్న సమాజంలో.. నోరున్న మనుషులకంటే నోరులేని మూగజీవాలే మేలు అన్న భావన కలుగుతుంది. అలాగే రతన్ టాటాకు కూడా మూగజీవాలంటే ఎనలేని ప్రేమ. వాటికోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని కూడా నిర్మించారాయన. ఓ 7 నెలల వయసున్న వీధిశునకం అనారోగ్యం బాధపడుతోంది. దానికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. కానీ.. అది రక్తహీనతతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు టెస్టుల్లో తేలింది.

Advertisement

దీంతో ఆ శునకాన్ని కాపాడేందుకు సహాయం చేయాలని ఇన్ స్టా వేదికగా అభ్యరించారు రతన్ టాటా. ఆ మూగజీవాన్ని కాపాడేందుకు తమ ఆస్పత్రిలో సిబ్బంది ఎంతో ప్రయత్నిస్తున్నారని, కానీ దాని చికిత్సకు బ్లడ్ కావాలని తెలిపారు. మీ వద్ద పూర్తి ఆరోగ్యంగా ఉన్న శునకం ఉంటే.. దాని రక్తాన్ని ఈ శునకం కోసం దానం చేయాలని కోరారు. ఈ సహాయం చేస్తారని ఆశిస్తున్నా అని వీడియోలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా చెప్పారు.

Also Read : వైరల్ అవుతున్న కుక్క వీడియో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Advertisement

అయితే బిలీనియర్ అయిన రతన్ టాటా.. ఆయనకు ఎన్నిపనులున్నా పక్కనపెట్టి మరీ.. ఒక వీధి శునకం కోసం ఇలా నెటిజన్లను అభ్యర్థించేందుకు సమయం కేటాయించడం, ఆ ఆలోచన రావడం చాలా గొప్పవిషయమని కొనియాడుతున్నారు నెటిజన్లు. మీ మంచి మనసుకు ఇదే మా సెల్యూట్ సార్ అని కామెంట్లు పెడుతున్నారు. రతన్ టాటా రిక్వెస్ట్ స్పందించిన నెటిజన్లలో ఒకరు.. ఆ శునకానికి సహాయం చేశారు. మీ సహాయానికి ధన్యవాదాలు అని తెలిపారు. కాగా.. ఇన్ స్టా గ్రామ్ లో రతన్ టాటాకు 9.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Tags

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×