E-Paper
Advertisement

Ratan Tata Request: నెటిజన్లకు రతన్ టాటా రిక్వెస్ట్.. “ప్లీజ్ దానిని కాపాడండి”..!

Ratan Tata Request: నెటిజన్లకు రతన్ టాటా రిక్వెస్ట్.. “ప్లీజ్ దానిని కాపాడండి”..!

Ratan Tata Urgent Request to Netizens: రతన్ టాటా. పరిచయం అక్కర్లేని వారిలో ఈయన ఒకరు. ప్రపంచ బిలీనియర్లలోనే కాదు.. ఎంతో మందికి సహాయం చేయడంలోనూ ముందుంటారాయన. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ఆదుకుంటారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు ముంబై వాసులను సహాయం చేయండని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ వీధిశునకం ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయండని రిక్వెస్ట్ చేశారు.

ఇప్పుడున్న సమాజంలో.. నోరున్న మనుషులకంటే నోరులేని మూగజీవాలే మేలు అన్న భావన కలుగుతుంది. అలాగే రతన్ టాటాకు కూడా మూగజీవాలంటే ఎనలేని ప్రేమ. వాటికోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని కూడా నిర్మించారాయన. ఓ 7 నెలల వయసున్న వీధిశునకం అనారోగ్యం బాధపడుతోంది. దానికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. కానీ.. అది రక్తహీనతతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు టెస్టుల్లో తేలింది.

దీంతో ఆ శునకాన్ని కాపాడేందుకు సహాయం చేయాలని ఇన్ స్టా వేదికగా అభ్యరించారు రతన్ టాటా. ఆ మూగజీవాన్ని కాపాడేందుకు తమ ఆస్పత్రిలో సిబ్బంది ఎంతో ప్రయత్నిస్తున్నారని, కానీ దాని చికిత్సకు బ్లడ్ కావాలని తెలిపారు. మీ వద్ద పూర్తి ఆరోగ్యంగా ఉన్న శునకం ఉంటే.. దాని రక్తాన్ని ఈ శునకం కోసం దానం చేయాలని కోరారు. ఈ సహాయం చేస్తారని ఆశిస్తున్నా అని వీడియోలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా చెప్పారు.

Also Read : వైరల్ అవుతున్న కుక్క వీడియో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

అయితే బిలీనియర్ అయిన రతన్ టాటా.. ఆయనకు ఎన్నిపనులున్నా పక్కనపెట్టి మరీ.. ఒక వీధి శునకం కోసం ఇలా నెటిజన్లను అభ్యర్థించేందుకు సమయం కేటాయించడం, ఆ ఆలోచన రావడం చాలా గొప్పవిషయమని కొనియాడుతున్నారు నెటిజన్లు. మీ మంచి మనసుకు ఇదే మా సెల్యూట్ సార్ అని కామెంట్లు పెడుతున్నారు. రతన్ టాటా రిక్వెస్ట్ స్పందించిన నెటిజన్లలో ఒకరు.. ఆ శునకానికి సహాయం చేశారు. మీ సహాయానికి ధన్యవాదాలు అని తెలిపారు. కాగా.. ఇన్ స్టా గ్రామ్ లో రతన్ టాటాకు 9.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×