E-Paper
Advertisement

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..
BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast
BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast

BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం వర్గాలు తెలిపాయి. గత వారం NIA చేత ఇద్దరు మొబైల్ షాప్ వ్యక్తులను ప్రశ్నించగా సాయి ప్రసాద్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో సాయి ప్రసాద్‌ను ఎన్‌ఐఏ విచారణకు తీసుకువెళ్లింది. గత వారం శివమొగ్గలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించి ఓ మొబైల్ స్టోర్‌తో పాటు ఇద్దరు అనుమానితుల ఇళ్లపై దాడులు చేసింది.

మరోవైపు కర్ణాటకలో సాయిప్రసాద్‌ను నిర్బంధించడంపై కాంగ్రెస్‌ బీజేపీపై విరుచుకుపడింది. కాంగ్రెస్ నాయకుడు దినేష్ గుండూరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని కాషాయ మద్దతుదారులు ఇప్పుడు ఏమి చెబుతారని ప్రశ్నించారు.

కాగా బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×