E-Paper
Advertisement

Blast in Firecrakers Factory : శివకాశీ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి

Blast in Firecrakers Factory : శివకాశీ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి

Blast in Firecrackers manufacturing Factory(Today’s news in telugu): తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశిలో మరోసారి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. కలయార్ కురిచ్చిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవ్వగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజన్లతో ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మృతులను మరియప్పన్, ముత్తువేల్ గా గుర్తించారు.

కాగా.. గత నెల 29న విరుదునగర్ జిల్లా సత్తూర్ కు సమీపంలోని బందువార్ పట్టిలో గల బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బాణసంచా కేంద్రమంతా నేలమట్టమవ్వగా.. నలుగురు సజీవదహనమయ్యారు. 10 రోజుల వ్యవధిలో మరో ప్రమాదం జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. శివకాశీలో తరచూ బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు జరుగుతుంటాయి.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×