E-Paper
Advertisement

Blast in Firecrakers Factory : శివకాశీ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి

Blast in Firecrakers Factory : శివకాశీ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి
Advertisement

Blast in Firecrackers manufacturing Factory(Today’s news in telugu): తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశిలో మరోసారి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. కలయార్ కురిచ్చిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవ్వగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజన్లతో ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మృతులను మరియప్పన్, ముత్తువేల్ గా గుర్తించారు.

కాగా.. గత నెల 29న విరుదునగర్ జిల్లా సత్తూర్ కు సమీపంలోని బందువార్ పట్టిలో గల బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బాణసంచా కేంద్రమంతా నేలమట్టమవ్వగా.. నలుగురు సజీవదహనమయ్యారు. 10 రోజుల వ్యవధిలో మరో ప్రమాదం జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. శివకాశీలో తరచూ బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు జరుగుతుంటాయి.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×