E-Paper
Advertisement

Bomb Threat: మధ్యాహ్నం బాంబులు పేలుతాయి! బాంబే స్టాక్ ఎక్స్చేంజీకి బెదిరింపులు

Bomb Threat: మధ్యాహ్నం బాంబులు పేలుతాయి! బాంబే స్టాక్ ఎక్స్చేంజీకి బెదిరింపులు
Advertisement

Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 3 గంటలకు పేల్చేయబోతున్నట్లు మెయిల్ వచ్చింది.

మెయిల్‌లో బెదిరింపు
కామ్రేడ్ పినరయి విజయన్ అనే మెయిల్ ఐడీతో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాంబు స్వ్కాడ్‌తో ముమ్మరంగా గాలించారు. దీనితో వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌, ఫైర్‌ సర్వీసుల బృందాలను రంగంలోకి దింపారు. BSE పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement

ముమ్మర తనిఖీలు
బాంబ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో భవనం అంతటా.. క్లిష్టమైన తనిఖీలు నిర్వహించాయి. మెటల్ డిటెక్టర్లతో పాటు బాంబ్ డిటెక్షన్, డిస్‌పోజల్ యూనిట్‌ (BDDS) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గదులు, కేబిన్లు, పార్కింగ్, స్టోరేజ్ ప్రాంతాలను శోధించారు. చివరకు, ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు అక్కడ లభించలేదని.. అధికారులు స్పష్టం చేశారు.

నకిలీ బెదిరింపు కావచ్చునన్న అనుమానం
తదుపరి విచారణలో ఈ బెదిరింపు నకిలీ అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మెయిల్‌లో ఉపయోగించిన ఐడీ “కామ్రేడ్ పినరయి విజయన్” పేరుతో ఉండటం, ఇది కేరళ ముఖ్యమంత్రి పేరుతో పోలిక కలిగించడమే కాక, రాజకీయ అజెండా కలిగి ఉన్నవారు కావచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. అయితే మెయిల్ టెంప్లేట్, ఐపీ అడ్రస్, మెటా డేటాను ట్రాక్ చేయడానికి సైబర్ క్రైం విభాగం ఇప్పటికే పని ప్రారంభించింది.

Advertisement

కేసు నమోదు – సైబర్ విచారణ వేగంగా కొనసాగుతోంది
ఈ ఘటనపై ముంబై పోలీస్ కమిషనరేట్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఐటీ యాక్ట్‌, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) చట్టాల కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సీబీఐ, ఎన్ఐఏ వంటి జాతీయ స్థాయి సంస్థల సహకారం.. అవసరమైతే తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

భద్రతా మార్గదర్శకాలు పునర్విమర్శ
ఈ ఘటన నేపథ్యంలో, ముంబై నగరంలోని ఇతర కీలక ఆర్థిక, ప్రభుత్వ భవనాల భద్రతను మరోసారి సమీక్షించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. BSE, NSE, RBI, SBI ప్రధాన కార్యాలయాలు వంటి కేంద్రాలను లక్ష్యంగా చేసుకునే నకిలీ బెదిరింపుల పరిస్థితులపై.. ముందస్తుగా స్పందించేందుకు ప్రత్యేక డ్రిల్‌లు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకు ఇది నకిలీ బెదిరింపుగా ఉన్నా, ఇందులో ఉన్న ఆంతర్యాన్ని ప్రభుత్వ, భద్రతా యంత్రాంగాలు తేలికగా తీసుకోవడం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

Also Read: దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి.. ఎక్కడో తెలుసా..?

ఈ ఘటన మరోసారి భద్రతా వ్యవస్థల లోపాలను సూచించడమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానంతో జరగుతున్న నేరాలకు.. మరింత చురుకుగా స్పందించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×