E-Paper
Advertisement

Jawan: పాకిస్తాన్ బార్డర్‌లో ఇద్దరు భారత సైనికులు మరణం.. కాల్పుల వల్ల కాదు..

Jawan: పాకిస్తాన్ బార్డర్‌లో ఇద్దరు భారత సైనికులు మరణం.. కాల్పుల వల్ల కాదు..
Advertisement

BSF: పాకిస్తాన్, భారత్ మధ్య సరిహద్దులో ఆ సైనికులు పెట్రోలింగ్‌కు బయల్దేరారు. గుజరాత్ వెంట ఉన్న సరిహద్దు ప్రాంతంలో ఆయన గస్తీ కాయడానికి వెళ్లారు. కానీ, ఆ సైనికులు తిరిగి పెట్రోలింగ్ బేస్ స్టేషన్‌కు రాలేదు. దారి మధ్యలోనే మరణించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన కాల్పులో.. మోర్టార్ షెల్లింగ్ వల్లనో మరణించలేదు. తీవ్రమైన ఎండలో పహారా కాస్తున్న సదరు సైనికులకు ఎండ దెబ్బ తాకింది. సమయానికి వెంట తెచ్చుకున్న నీళ్లు కూడా అయిపోవడం, ఎనర్జీ ఫ్లూడ్స్ కూడా ఏమీ లేకపోవడంతో బార్డర్ ఫోర్స్ ఆఫీసర్, జవాను ప్రాణాలు కోల్పోయాడు.

హరామీ నల్లా కొండ ప్రాంతలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఆఫీసర్, జవాన్‌ పహారాకు వెళ్లారు. అసిస్టెంట్ కమాండంట్ విశ్వ దేవ్, హెడ్ కానిస్టేబుల్ దయాల్ రామ్‌లు 34 నుంచి 36 డిగ్రీల ఎండలో పహారా కాస్తుండగానే ఎండ దెబ్బకు గురయ్యారు. శుక్రవారం సరిహద్దు ప్రాంతంలోనే వీరిద్దరూ మరణించారు. ప్రస్తుతం రన్ ఆఫ్ కచ్, హరామీ నల్లా ఏరియాలో 34 నుంచి 36 డిగ్రీల ఎండకాస్తున్నట్టు సమాచారం. ఇక్కడ తేమ శాతం 80 నుంచి 82 శాతంగా ఉన్నది.

Advertisement

Also Read: కేసీఆర్ తనకు తానే ఆర్కిటెక్ట్ అనుకుని కట్టిన ప్రాజెక్ట్ ఇదీ.. అందుకే ఇంత నష్టం

దేవ్ 59వ బెటాలియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఆఫీసర్. పెట్రోల్ టీమ్ వద్ద నీరు, ఎనర్జీ ఫ్లూడ్స్ అయిపోయయి. అయితే, సమీప బేస్ నుంచి టీమ్ నీటిని తీసుకువచ్చిందని వారు చెప్పారు. సాయంత్రానికల్లా భుజ్‌లోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లినా.. వారిద్దరిని కాపాడుకోలేకపోయారని తెలిసింది.

Advertisement

మే నెలలో కూడా ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో రాజస్తాన్‌‌కు చెందిన జైసల్మేర్ ఏరియాలో ఎండదెబ్బ తగిలి మరణించాడు. వర్షాకాలంలోనూ సరిహద్దు ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఎండలు కాస్తున్నాయి. సరిహద్దు వెంట పహారా కాస్తున్న జవాన్లు కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇక శీతాకాలంలోనూ ముఖ్యంగా కశ్మీర్ వైపున పహారా కాసే జవాన్లు గడ్డకట్టే చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కఠోర శీతోష్ణ స్థితులను సైనికులు తమ విధి నిర్వహణలో భాగంగా రెగ్యులర్‌గా ఎదుర్కొంటూనే ఉంటారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×