BigTV English

Jawan: పాకిస్తాన్ బార్డర్‌లో ఇద్దరు భారత సైనికులు మరణం.. కాల్పుల వల్ల కాదు..

Jawan: పాకిస్తాన్ బార్డర్‌లో ఇద్దరు భారత సైనికులు మరణం.. కాల్పుల వల్ల కాదు..

BSF: పాకిస్తాన్, భారత్ మధ్య సరిహద్దులో ఆ సైనికులు పెట్రోలింగ్‌కు బయల్దేరారు. గుజరాత్ వెంట ఉన్న సరిహద్దు ప్రాంతంలో ఆయన గస్తీ కాయడానికి వెళ్లారు. కానీ, ఆ సైనికులు తిరిగి పెట్రోలింగ్ బేస్ స్టేషన్‌కు రాలేదు. దారి మధ్యలోనే మరణించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన కాల్పులో.. మోర్టార్ షెల్లింగ్ వల్లనో మరణించలేదు. తీవ్రమైన ఎండలో పహారా కాస్తున్న సదరు సైనికులకు ఎండ దెబ్బ తాకింది. సమయానికి వెంట తెచ్చుకున్న నీళ్లు కూడా అయిపోవడం, ఎనర్జీ ఫ్లూడ్స్ కూడా ఏమీ లేకపోవడంతో బార్డర్ ఫోర్స్ ఆఫీసర్, జవాను ప్రాణాలు కోల్పోయాడు.


హరామీ నల్లా కొండ ప్రాంతలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఆఫీసర్, జవాన్‌ పహారాకు వెళ్లారు. అసిస్టెంట్ కమాండంట్ విశ్వ దేవ్, హెడ్ కానిస్టేబుల్ దయాల్ రామ్‌లు 34 నుంచి 36 డిగ్రీల ఎండలో పహారా కాస్తుండగానే ఎండ దెబ్బకు గురయ్యారు. శుక్రవారం సరిహద్దు ప్రాంతంలోనే వీరిద్దరూ మరణించారు. ప్రస్తుతం రన్ ఆఫ్ కచ్, హరామీ నల్లా ఏరియాలో 34 నుంచి 36 డిగ్రీల ఎండకాస్తున్నట్టు సమాచారం. ఇక్కడ తేమ శాతం 80 నుంచి 82 శాతంగా ఉన్నది.

Also Read: కేసీఆర్ తనకు తానే ఆర్కిటెక్ట్ అనుకుని కట్టిన ప్రాజెక్ట్ ఇదీ.. అందుకే ఇంత నష్టం


దేవ్ 59వ బెటాలియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఆఫీసర్. పెట్రోల్ టీమ్ వద్ద నీరు, ఎనర్జీ ఫ్లూడ్స్ అయిపోయయి. అయితే, సమీప బేస్ నుంచి టీమ్ నీటిని తీసుకువచ్చిందని వారు చెప్పారు. సాయంత్రానికల్లా భుజ్‌లోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లినా.. వారిద్దరిని కాపాడుకోలేకపోయారని తెలిసింది.

మే నెలలో కూడా ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో రాజస్తాన్‌‌కు చెందిన జైసల్మేర్ ఏరియాలో ఎండదెబ్బ తగిలి మరణించాడు. వర్షాకాలంలోనూ సరిహద్దు ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఎండలు కాస్తున్నాయి. సరిహద్దు వెంట పహారా కాస్తున్న జవాన్లు కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇక శీతాకాలంలోనూ ముఖ్యంగా కశ్మీర్ వైపున పహారా కాసే జవాన్లు గడ్డకట్టే చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కఠోర శీతోష్ణ స్థితులను సైనికులు తమ విధి నిర్వహణలో భాగంగా రెగ్యులర్‌గా ఎదుర్కొంటూనే ఉంటారు.

Tags

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×