BigTV English
Advertisement

BSP Chief Mayawati : బీఎస్పీ అధ్యక్షుడి హత్యపై మాయావతి ఆగ్రహం.. తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి

BSP Chief Mayawati : బీఎస్పీ అధ్యక్షుడి హత్యపై మాయావతి ఆగ్రహం.. తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి

BSP Chief Mayawati Calls for Peace(Latest telugu news): తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడి హత్యపై.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కె.ఆర్మ్ స్ట్రాంగ్ ను దారుణంగా నరికి చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే.. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని కార్యకర్తలకు సూచించారు. ఆర్మ్ స్ట్రాంగ్ కు నివాళులు అర్పించి.. అతని కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఆదివారం చెన్నైకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.


తమిళనాడులో బీఎస్పీ కోసం కష్టపడి పనిచేసే నాయకుడు, రాష్ట్ర పార్టీ యూనిట్ అధ్యక్షుడు కె. ఆర్మ్ స్ట్రాంగ్ ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని తన నివాసం వెలుపల దారుణంగా హత్యచేశారని ఆమె X వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం తక్షణమే కఠినమైన చర్యలను తీసుకోవాలని, అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : త్రిపురలో డేంజర్ బెల్స్, హెచ్ఐవీతో 47మంది మృతి.. 


ఆర్మ్ స్ట్రాంగ్ చెన్నై కార్పొరేషన్లో కౌన్సిలర్ గా పనిచేశారని, అతను దళితుల సమస్యలపై గొంతెత్తి పోరాడారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఆర్మ్ స్ట్రాంగ్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బీఎస్పీ మద్దతుదారులు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్యను ఆపడంలో విఫలమైన ఏడీజీపీని తొలగించాలని అతని మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఆర్మ్ స్ట్రాంగ్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. మరోవైపు ఆర్మ్ స్ట్రాంగ్ మృతిపట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. హత్యకు కారణమైన వారిని పోలీసులు గతరాత్రే అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×