E-Paper
Advertisement

Mayawati: ఇందుకోసమేనా తన మేనల్లుడిని మాయావతి ఆ పదవి నుంచి తొలిగించింది?

Mayawati: ఇందుకోసమేనా తన మేనల్లుడిని మాయావతి ఆ పదవి నుంచి తొలిగించింది?
Advertisement

BSP President Mayawati: తన రాజకీయ వారుసుడిగా, జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయనపై మాయవతి వేటు వేశారు. అతనికి పూర్తి పరిపక్వత వచ్చేవరకు ఈ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ ఆమె మంగళవారం ప్రకటించారు.

అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటుగా ఉద్యమం కోసం బీఎస్పీ నాయకత్వం ఎలాంటి త్యాగానికైనా వెనుకాడబోదంటూ ఆమె పేర్కొన్నారు. బీఎస్పీ అంటే పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక.. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉద్యమం అంటూ ఆమె పేర్కొన్నారు. తన సోదరుడు, ఆకాశ్ తండ్రి ఆనంద్ కుమార్ ఇంతకుముందు మాదిరిగానే ఆ బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆమె పేర్కొన్నారు. అయితే, ఆకాశ్ ఆనంద్ పదవీ బాధ్యతలను స్వీకరించిన ఐదు నెలల్లోనే పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

Advertisement

అయితే, బహిరంగ సభలలో ఆకాశ్ ఆనంద్ పాల్గొని ప్రసంగించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయని, ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు పడిందంటూ చర్చించుకుంటున్నారు. అయితే, ఇటీవల సీతాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కూడా ఆకాశ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసినట్లు సమాచారం.

Also Read: తీవ్ర విషాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

Advertisement

అయితే, బహిరంగ సభలు, రాజకీయ సమావేశాలు, ర్యాలీలలో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలంటూ ఆకాశ్ ను గత నెలలోనే మాయావతి హెచ్చరించారని, అయినా ఆతను పట్టించుకోలేదని, ఈ క్రమంలోనే ఆయనపై మాయావతి వేటు వేశారంటూ చర్చ కొనసాగుతోంది.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×