E-Paper
Advertisement

Karnataka : క్యాంపు రాజకీయాలు షురూ..! కాంగ్రెస్ అప్రమత్తం..

Karnataka : క్యాంపు రాజకీయాలు షురూ..! కాంగ్రెస్ అప్రమత్తం..
Advertisement

Karnataka election result live : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం ఖాయమైపోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి విజయం సాధించబోతోంది. మేజిక్ ఫిగర్ మాట ఇక అవసరంలేదు. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మరింత అప్రమత్తమైంది. ఆపరేషన్‌ కమలం ప్రభావం పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే చర్యలు చేపట్టింది.

గెలుపొందిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందని సమాచారం. ఈ విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రికి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పరిస్థితులను బట్టి అక్కడ నుంచి తమిళనాడు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

హంగ్ వస్తుందేమోనన్న అంచనాతో తొలుత బీజేపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసే యోచన చేసింది. జేడీఎస్ తో మంతనాలు ప్రారంభించింది. నేరుగా అమిత్ షా రంగంలోకి చర్చలు మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ తర్వాత బీజేపీ వెనక్కి తగ్గింది. ఓటమిని అంగీకరిస్తూ సీఎం బసవరాజ్ బొమ్మై స్వయంగా ప్రకటన చేశారు.

కర్ణాటకలో భారీ విజయం ఖాయమైన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం నిర్వహించే యోచన చేస్తోంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×