E-Paper
Advertisement

Karnataka : క్యాంపు రాజకీయాలు షురూ..! కాంగ్రెస్ అప్రమత్తం..

Karnataka : క్యాంపు రాజకీయాలు షురూ..! కాంగ్రెస్ అప్రమత్తం..

Karnataka election result live : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం ఖాయమైపోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి విజయం సాధించబోతోంది. మేజిక్ ఫిగర్ మాట ఇక అవసరంలేదు. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మరింత అప్రమత్తమైంది. ఆపరేషన్‌ కమలం ప్రభావం పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే చర్యలు చేపట్టింది.

గెలుపొందిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందని సమాచారం. ఈ విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రికి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పరిస్థితులను బట్టి అక్కడ నుంచి తమిళనాడు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హంగ్ వస్తుందేమోనన్న అంచనాతో తొలుత బీజేపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసే యోచన చేసింది. జేడీఎస్ తో మంతనాలు ప్రారంభించింది. నేరుగా అమిత్ షా రంగంలోకి చర్చలు మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ తర్వాత బీజేపీ వెనక్కి తగ్గింది. ఓటమిని అంగీకరిస్తూ సీఎం బసవరాజ్ బొమ్మై స్వయంగా ప్రకటన చేశారు.

కర్ణాటకలో భారీ విజయం ఖాయమైన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం నిర్వహించే యోచన చేస్తోంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×