BigTV English

Karnataka : క్యాంపు రాజకీయాలు షురూ..! కాంగ్రెస్ అప్రమత్తం..

Karnataka : క్యాంపు రాజకీయాలు షురూ..! కాంగ్రెస్ అప్రమత్తం..

Karnataka election result live : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం ఖాయమైపోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి విజయం సాధించబోతోంది. మేజిక్ ఫిగర్ మాట ఇక అవసరంలేదు. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మరింత అప్రమత్తమైంది. ఆపరేషన్‌ కమలం ప్రభావం పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే చర్యలు చేపట్టింది.


గెలుపొందిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందని సమాచారం. ఈ విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రికి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పరిస్థితులను బట్టి అక్కడ నుంచి తమిళనాడు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హంగ్ వస్తుందేమోనన్న అంచనాతో తొలుత బీజేపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసే యోచన చేసింది. జేడీఎస్ తో మంతనాలు ప్రారంభించింది. నేరుగా అమిత్ షా రంగంలోకి చర్చలు మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ తర్వాత బీజేపీ వెనక్కి తగ్గింది. ఓటమిని అంగీకరిస్తూ సీఎం బసవరాజ్ బొమ్మై స్వయంగా ప్రకటన చేశారు.


కర్ణాటకలో భారీ విజయం ఖాయమైన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం నిర్వహించే యోచన చేస్తోంది.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×