E-Paper
Advertisement

Road Accident : బస్సు – కారు ఢీ.. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోరప్రమాదం

Road Accident : బస్సు – కారు ఢీ.. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోరప్రమాదం

Car hits bus on agra-lucknw expressway: ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో ఆగ్రా – లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీ కొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడ్డారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కారు అదుపుతప్పి.. లేన్ నుంచి బయటకు వెళ్లి అటువైపు రాయ్ బరేలీ నుంచి ఢిల్లీకి వస్తున్న స్లీపర్ బస్సును ఢీ కొట్టినట్లు పోలీసులు వివరించారు. ప్రమాద తీవ్రతలో బస్సు ఎక్స్ ప్రెస్ వే పై నుంచి పడిపోయింది. దాంతో అందులో ఉన్న ప్రయాణికులు కాపాడాలని కేకలు పెట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.

మృతులు కన్నౌజ్ కు చెందిన ప్రద్యుమ్ (24), మోను (25), చందా (50) గా గుర్తించారు. బస్సులో ఉన్నవారిలో లఖింపూర్ ఖేరీకి చెందిన ఓం ప్రకాష్ (50), అమేథీ నివాసి రాజు షా, గుర్తుతెలియని వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఎస్ఏపీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×