E-Paper
Advertisement

Odisha Train Accident : కుట్ర వల్లే ప్రమాదం..? రంగంలోకి దిగిన సీబీఐ..

Odisha Train Accident : కుట్ర వల్లే ప్రమాదం..? రంగంలోకి దిగిన సీబీఐ..
Advertisement

Odisha Train Accident News Today(Telugu news updates): ఒడిశా రైలు దుర్ఘటనపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. 10 మంది సీబీఐ అధికారుల బృందం బాలాసోర్‌లోని ప్రమాద జరిగిన ప్రాంతానికి వెళ్లింది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించింది. ఒడిశా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను సీబీఐ సేకరించింది.

Advertisement

రైలు ప్రమాదంపై రాష్ట్ర పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యమే కారణమని అభియోగాలు మోపుతూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.

విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని రైల్వే అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. లేకపోతే మెయిన్‌లైన్‌ మార్గాన్ని లూప్‌ లైనుకు మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేశామని అంటున్నారు. సీబీఐ దర్యాప్తు తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.

Advertisement

రైలు దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 278కి చేరిందని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే చాలా మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. ఇంకా 101 మృతదేహాలు ఎవరివో తేల్చాల్చి ఉంది. దీంతో మృతదేహాలను భద్రపరచడం ఆస్పత్రులకు సవాలుగా మారింది. మృతదేహాలను గుర్తించేందుకు ఒడిశా ప్రభుత్వం, రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మృతుల ఫొటోలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×