BigTV English

Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”

Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”

Home Minister Amit Shah on Wayanad Tragedy : వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 180 మంది మరణించగా 130 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతుల్లో 75 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యలో వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.


తాజాగా వయనాడ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కేరళలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై రాజ్యసభలో ఓ ప్రకటన చేశారాయన. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ముందే హెచ్చరించామని, జూలై 23నే అప్రమత్తం చేసినా.. కేరళ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్ర పౌరులను సకాలంలో తరలించలేదని తెలిపారు. కేరళలో భారీవర్షాలు మొదలవ్వగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని చెప్పారు.

Also Read : వయనాడ్ వెళ్తుండగా మంత్రి కారుకి ప్రమాదం.. స్వల్ప గాయాలు


ప్రకృతి వైపరీత్యాల గురించి వారంరోజుల ముందుగానే హెచ్చరించే వ్యవస్థ భారత్ లో ఉందన్నారాయన. ప్రపంచంలో ఇలాంటి సాంకేతికత ఉన్న 4 దేశాల్లో మనదేశం ఒకటని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేరళకు చేరుకున్న వెంటనే అప్రమత్తమై.. ఆ ప్రాంతవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లైతే.. వయనాడ్ ఇంతటి విషాదాన్ని చూసేది కాదన్నారు అమిత్ షా. ఈ ప్రమాదంతో తీరని విషాదంలో ఉన్న కేరళ ప్రజలకు.. మోదీ సర్కార్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×