E-Paper
Advertisement

Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”

Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”

Home Minister Amit Shah on Wayanad Tragedy : వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 180 మంది మరణించగా 130 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతుల్లో 75 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యలో వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

తాజాగా వయనాడ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కేరళలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై రాజ్యసభలో ఓ ప్రకటన చేశారాయన. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ముందే హెచ్చరించామని, జూలై 23నే అప్రమత్తం చేసినా.. కేరళ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్ర పౌరులను సకాలంలో తరలించలేదని తెలిపారు. కేరళలో భారీవర్షాలు మొదలవ్వగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని చెప్పారు.

Also Read : వయనాడ్ వెళ్తుండగా మంత్రి కారుకి ప్రమాదం.. స్వల్ప గాయాలు

ప్రకృతి వైపరీత్యాల గురించి వారంరోజుల ముందుగానే హెచ్చరించే వ్యవస్థ భారత్ లో ఉందన్నారాయన. ప్రపంచంలో ఇలాంటి సాంకేతికత ఉన్న 4 దేశాల్లో మనదేశం ఒకటని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేరళకు చేరుకున్న వెంటనే అప్రమత్తమై.. ఆ ప్రాంతవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లైతే.. వయనాడ్ ఇంతటి విషాదాన్ని చూసేది కాదన్నారు అమిత్ షా. ఈ ప్రమాదంతో తీరని విషాదంలో ఉన్న కేరళ ప్రజలకు.. మోదీ సర్కార్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×