E-Paper
Advertisement

Delhi Farmers Protest Update: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కీలక ప్రతిపాదన

Delhi Farmers Protest Update: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కీలక ప్రతిపాదన
Advertisement
Union ministers and Farmer Leaders Meeting

Union ministers and Farmer Leaders Meeting: తమ డిమాండ్ల సాధనకై రైతులు.. ఢిల్లీ చలో పేరిట చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు మూడుసార్లు విఫలమవ్వగా.. నాలుగో దఫా చర్చలో కేంద్రం రైతుసంఘాలకు కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. ఆదివారం రాత్రి 8.15 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ.. సోమవారం తెల్లవారుజామున 1 గంట వరకూ కొనసాగింది. ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రైతు నేతలతో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం.. మంత్రి పీయూష్ గోయెల్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

రైతు సంఘాలతో రైతుల డిమాండ్లపై చర్చించామని, రైతులతో ఒప్పందం చేసుకున్న అనంతరం ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం రైతు సంఘాలకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ముఖ్యంగా కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందాలు చేసుకుంటాయని, కొనుగోలు చేసేటపుడు వాటి పరిమాణంపై ఎలాంటి పరిమితి ఉండదని పేర్కొన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను కూడా ప్రారంభిస్తామని మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

Advertisement

రైతు సంఘాలకు తాము చేసిన ప్రతిపాదనలతో పంజాబ్ లో రైతుల వ్యవసాయానికి రక్షణ ఉంటుందన్నారు. అలాగే భూగర్భజలాలు మెరుగయ్యి.. సాగుభూములు నిస్సారంగా మారకుండా ఉంటాయన్నారు.

Read More: లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ఊరట.. ఆప్ నేతల్లో గుబులు అదే..

Advertisement

మరోవైపు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ స్పందించారు. ప్రభుత్వ ప్రతిపాదనల గురించి సోమ, మంగళవారాల్లో తాము తమ సంఘాలతో చర్చించి, నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఒక నిర్ణయానికి వస్తామని వివరించారు. అయితే రైతు రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని, దానిపై రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి ఢిల్లీ చలో కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు తెలిపారు. తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం రాని నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి తిరిగి నిరసనలు, ఆందోళనలు ప్రారంభిస్తామన్నారు.

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×