E-Paper
Advertisement

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు దాగి ఉన్నారన్న స్పష్టమైన సమాచారం ఆధారంగా అక్కడికెళ్లిన భద్రతా బలగాలకు, రెడ్‌ కారిడార్‌లోని దాడులకు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. అయితే ఘర్షణ తీవ్రంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు.

ప్రత్యేక ఆపరేషన్‌ ప్రారంభించిన కొబ్రా, డీఆర్‌జి, జిల్లా పోలీసుల సంయుక్త బలగాలు కరిగుండం అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అక్కడ దాగి ఉన్న మావోయిస్టులు తమ ఉనికిని గుర్తించిన వెంటనే కాల్పులు ప్రారంభించినట్లు భద్రతా సిబ్బంది సమాచారం. ఆ తరువాత గంటకు పైగా రెండు వైపులా తీవ్ర కాల్పులు జరిగాయి.

Als0 Read: ఆర్జేడీకి బిగ్ షాక్.. రాజకీయాలకు రోహిణి ఆచార్య గుడ్ బై

ఎన్‌కౌంటర్‌ ముగిసిన తరువాత భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని పరిశీలించగా—ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, కార్ట్రిడ్జ్‌లు, తుపాకులు, దేశీయ బాంబులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×