E-Paper
Advertisement

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!
Advertisement

Cloudburst: కశ్మీర్‌లోని పర్వత ప్రాంతాలు మళ్లీ ప్రకృతి కోపానికి వణికిపోయాయి. దోడా జిల్లాలో చోటుచేసుకున్న క్లౌడ్ బరస్ట్ భయానక పరిస్థితులను సృష్టించింది. భారీ వర్షాలు ఒక్కసారిగా కురవడంతో కొండచరియలు విరిగిపడి, వరదలతో ఊర్లు, రహదారులు మునిగిపోయాయి. ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం, ఈ విపత్తులో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.

దోడాతో పాటు కథువా, కిష్త్వార్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. పలు గ్రామాలు వరద ముప్పులో చిక్కుకోగా, అక్కడి ప్రజలు భయంతో ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేసి, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisement

ఆకస్మిక వర్షాలు.. వరదల రూపంలో విపత్తు
మంగళవారం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన వర్షాలు ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా కురవడంతో పరిస్థితి అదుపులో లేకపోయింది. కొండలపై వర్షపు నీరు జలపాతాల్లా కిందకు దూసుకువచ్చి గ్రామాలను ముంచేసింది. అధికారులు తెలిపిన ప్రకారం, ఈ అకస్మిక వరదల కారణంగా దాదాపు 10 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పంటలు కూడా నీట మునిగిపోయి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు.

తావి నది ఉప్పొంగి ప్రమాద హెచ్చరికలు
జమ్మూ నగరంలో తావి నది ఉప్పొంగిపొంగి ప్రవహిస్తోంది. నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే పనులు కొనసాగుతున్నాయి.

Advertisement

భారీ వర్ష సూచనతో పాఠశాలలకు సెలవు
జమ్మూ ప్రాంతంలో వచ్చే 2 రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దాంతో జమ్మూ, దోడా, కథువా, సాంబా, రాంబన్, కిష్త్వార్ జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం అత్యవసరంగా సెలవులు ప్రకటించింది.

జమ్మూ – శ్రీనగర్ రహదారి మూసివేత
కొండచరియలు విరిగిపడటంతో పాటు రాళ్లు జారిపడే ప్రమాదం కారణంగా జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కొన్ని రక్షణ వాహనాలు ప్రయాణానికి అనుమతించారు.

రెస్క్యూ బృందాలు అప్రమత్తం
ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ మరియు రిలీఫ్ బృందాలను పూర్తిగా అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తక్షణ సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారు. కొండప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్ల సాయంతో సర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.

Also Read: Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

రికార్డు స్థాయిలో వర్షపాతం
ఈ వారాంతంలో జమ్మూలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో 190.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇది శతాబ్దంలో ఆగస్టు నెలలో నమోదైన రెండవ అత్యధిక వర్షపాతం. చరిత్రలో అత్యధిక వర్షపాతం 1926 ఆగస్టు 5న 228.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఆ తరువాత 2022 ఆగస్టు 11న 189.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈసారి ఆ రికార్డును దాటేసే స్థాయిలో వర్షం కురవడం ఆందోళన కలిగిస్తోంది.

జాగ్రత్తలు తప్పనిసరి
వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రకారం, ఆగస్టు 27 వరకు ఎత్తైన ప్రాంతాలలో మేఘావృతాలు, ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలిపింది. స్థానిక ప్రజలు అవసరంలేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదం తలెత్తే ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

ప్రజలు ఆందోళనలో
ఇంత భారీ వర్షం ఇంతకాలం చూడలేదు. ఒక్కసారిగా ముంచెత్తిన నీరు ఇళ్లలోకి వచ్చేసింది. బతికేందుకు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చిందని దోడా జిల్లాకు చెందిన ఒక బాధితుడు కన్నీటితో చెప్పాడు. మరో మహిళ మాట్లాడుతూ, పిల్లలతో కలిసి రాత్రంతా భయంతో గడిపాం. రక్షణ బృందాలు వచ్చి మమ్మల్ని బయటకు తీసుకెళ్లకపోతే ఏమయ్యేదో తెలీదని వణుకుతూ వివరించారు.

జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ, తక్షణ సహాయక చర్యలను చేపట్టాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే కొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నందున అధికారులు, రెస్క్యూ బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు.

Related News

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×