E-Paper
Advertisement

Indigo: ఇండిగో కావాలనే నిర్లక్ష్యం చేసింది.. పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం

Indigo: ఇండిగో కావాలనే నిర్లక్ష్యం చేసింది.. పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం

Indigo: ఇండిగో విమాన సేవల అంతరాయంతో దేశం వ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దుపై కేంద్రం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించింది. నిర్వహణ లోపాల కారణంగా వందలాది ఇండిగో విమాన సర్వీసులు రద్దవ్వడంపై కేంద్రం నిశితంగా పరిశీలిస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం ఇండిగోకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది.

పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం

ఇండిగోకు ప్రత్యేక మినహాయింపులపై దుమారం రేగింది. ఇండిగోకు మినహాయింపులు ఇవ్వడంపై పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కావాలనే ఇండిగో నిర్లక్ష్యం వహించిందని పైలట్స్ అసోసియేషన్ పేర్కొంది. 2024 జనవరిలోనే డీజీసీఏ కొత్త నిబంధనలు ప్రకటించిందని తెలిపింది. అయినా సరిపడా పైలట్లను ఇండిగో ఏర్పాటు చేసుకోలేదని ఆరోపించింది. డీజీసీఏ వారాంతపు విశ్రాంతిని సడలించడం వల్ల పైలట్లకు సరైన విశ్రాంతి ఉండదని పైలట్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దాని వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిపింది.

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×