BigTV English
Advertisement

Rahul Gandhi : భారత్ జోడో యాత్రపై కరోనా ఎఫెక్ట్.. రాహుల్ కు కేంద్రం లేఖ..

Rahul Gandhi : భారత్ జోడో యాత్రపై కరోనా ఎఫెక్ట్.. రాహుల్ కు కేంద్రం లేఖ..

Rahul Gandhi : దేశంలో కరోనా కలవరం మళ్లీ మొదలైంది. కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో ఈ ఎఫెక్ట్ భారత్ జోడో యాత్రపై పడింది. రాహుల్‌ గాంధీ పాదయాత్ర వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ.. రాహుల్‌కు లేఖ రాశారు. కొవిడ్‌ నిబంధనలను పాటించలేకపోతే.. యాత్రను కొంతకాలం నిలిపివేయాలని సూచించారు.


భారత్‌ జోడో యాత్ర వల్ల రాజస్థాన్ లో కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై డిసెంబర్ 20న కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్ కరోనా బారిన పడిన విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భారత్ జోడో యాత్రలో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని కోరారు. మాస్క్‌లు, శానిటైజర్లు ఉపయోగించాలని, వ్యాక్సిన్ వేసుకున్నవారినే యాత్రకు అనుమతించాలన్నారు.

రాజస్థాన్ ఎంపీలు రాసిన లేఖపై కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పందించారు. రాహుల్ గాంధీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోట్ కు లేఖలు రాశారు. భారత్ జోడో యాత్రలో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. లేకపోతే యాత్రను కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాలని కోరారు. మరోవైపు బుధవారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర రాజస్థాన్‌ నుంచి హర్యానాకు చేరుకుంది.


కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాహుల్ కు లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇటీవల గుజరాత్‌ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ భారీ రోడ్‌ షో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాస్క్‌ పెట్టుకున్నారా? అని ప్రశ్నించింది. రాహుల్‌ గాంధీకి వస్తున్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని విమర్శించింది. కాంగ్రెస్ కు ప్రజల నుంచి వస్తోన్న స్పందనను తట్టుకోలేకనే కాషాయ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని అధిర్‌ రంజన్‌ చౌదరీ మండిపడ్డారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×