E-Paper
Advertisement

Coronavirus : దేశంలో కరోనా కలవరం.. పెరుగుతున్న జేఎన్‌.1 వేరియంట్ కేసులు..

Coronavirus :  దేశంలో కరోనా కలవరం.. పెరుగుతున్న  జేఎన్‌.1 వేరియంట్ కేసులు..
Advertisement

Coronavirus : దేశంలో కొవిడ్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దాంతో మంగళవారం నాటికి జేఎన్‌.1 మొత్తం కేసుల సంఖ్య 69కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా గోవాలోనే ఈ కేసులు పెరగుతున్నాయని వెల్లడించాయి. ఈ వైరస్‌ సోకిన బాధితులు ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నాయి. ఆసుపత్రిలో చేరికల సంఖ్యలో పెరుగుదల కనిపించడం లేదన్నారు. ప్రస్తుతానికి ఈ వేరియంట్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం సూచించాయి.

కేరళలో కొన్ని రోజుల క్రితం ఈ జేఎన్‌.1 వేరియంట్‌కు సంబంధించి తొలి కేసు బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 79 ఏళ్ల మహిళకు కూడ జేఎన్ -1 సోకింది. అయితే ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది.

Advertisement

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. క్రియాశీల కేసులు 4,170కి చేరాయి. జేఎన్‌.1 గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×