BigTV English
Advertisement

Kerala News: కేరళలో సీపీఎం నేత నరికివేత..

Kerala News: కేరళలో సీపీఎం నేత నరికివేత..
kerala news today

CPM local leader hacked to death in Kerala (telugu news live): కేరళలో మరో రాజకీయ నేత హత్యకు గురయ్యారు. సీపీఎం పార్టీకి చెందిన స్థానిక నేత కోళికోడ్ జిల్లాలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో చంపేశారు. హతుడిని పీవీ సత్యనాథన్‌గా గుర్తించారు. కొయిలాండిలోని చెరియపురం ఆలయంలో ఓ ఉత్సవానికి ఆయన హాజరైన సమయంలో దుండగులు మాటు వేసి గొడ్డలితో ఆకస్మికంగా దాడి చేశారు.


ఈ దాడిలో బాధితుడి మెడ, వెనుకభాగంపై వేట్లు పడ్డాయి. రక్తమోడుతున్న సత్యనాథన్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన మరణించారు.

Read more:మణిపూర్ వివాదంలో కొత్తకోణం.. హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమన్న సుప్రీం ధర్మాసనం


హంతకులు పరారు కాగా.. వారు ఎవరన్నదీ గుర్తించాల్సి ఉంది. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొయిలాండి సీపీఎం సెంట్రల్ లోకల్ కమిటీ కార్యదర్శిగా సత్యనాథన్ పనిచేస్తున్నారు. హత్య దరిమిలా సీపీఎం పార్టీ స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చింది.

Tags

Related News

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Big Stories

×