E-Paper
Advertisement

Kerala News: కేరళలో సీపీఎం నేత నరికివేత..

Kerala News: కేరళలో సీపీఎం నేత నరికివేత..
kerala news today

CPM local leader hacked to death in Kerala (telugu news live): కేరళలో మరో రాజకీయ నేత హత్యకు గురయ్యారు. సీపీఎం పార్టీకి చెందిన స్థానిక నేత కోళికోడ్ జిల్లాలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో చంపేశారు. హతుడిని పీవీ సత్యనాథన్‌గా గుర్తించారు. కొయిలాండిలోని చెరియపురం ఆలయంలో ఓ ఉత్సవానికి ఆయన హాజరైన సమయంలో దుండగులు మాటు వేసి గొడ్డలితో ఆకస్మికంగా దాడి చేశారు.

ఈ దాడిలో బాధితుడి మెడ, వెనుకభాగంపై వేట్లు పడ్డాయి. రక్తమోడుతున్న సత్యనాథన్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన మరణించారు.

Read more:మణిపూర్ వివాదంలో కొత్తకోణం.. హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమన్న సుప్రీం ధర్మాసనం

హంతకులు పరారు కాగా.. వారు ఎవరన్నదీ గుర్తించాల్సి ఉంది. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొయిలాండి సీపీఎం సెంట్రల్ లోకల్ కమిటీ కార్యదర్శిగా సత్యనాథన్ పనిచేస్తున్నారు. హత్య దరిమిలా సీపీఎం పార్టీ స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చింది.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×