E-Paper
Advertisement

Crematorium Wall Collapsed: విషాదం.. ఐదుగురిని కబళించిన స్మశానం గోడ..!

Crematorium Wall Collapsed: విషాదం.. ఐదుగురిని కబళించిన స్మశానం గోడ..!

Crematorium Wall Collapsed in Haryana: మృత్యువు ఎప్పుడు, ఎవరిని ఏ రూపంలో కబళిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఈ క్షణం సంతోషంగా ఉన్నా.. మరుక్షణం ఏం జరుగుతుందో అంతుచిక్కదు. స్మశానం గోడకూలి చిన్నారి సహా ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగింది. అర్జున్ నగర్ ప్రాంతంలో స్మశానవాటిక గోడకూలడంతో.. మైనర్ బాలిక సహా ఐదుగురు సజీవసమాధి అయినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

శనివారం (ఏప్రిల్ 20) సాయంత్రం 6.20 గంటల సమయంలో మదన్ పురి స్మశాన వాటిక వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఘటన తర్వాత స్మశానవాటిక కేర్ టేకర్, మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు పరారీలో ఉన్నారని, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరగడంతో.. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ప్రమాద ఘటన సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అర్జున్ నగర్ కాలనీలో కొందరు నివాసితులు ఆ గోడకు పక్కనే కుర్చీలలో కూర్చుని ఉండగా.. 15 -20 అడుగుల ఎత్తయిన గోడ అకస్మాత్తుగా కూలి వారిపై పడింది. మృతులు దేవిదయాల్ (70), క్రిషన్ (52), మనోజ్ గబా (54), తాన్య (11), కుష్బూ (10)గా గుర్తించారు. గాయపడిన వారిలో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read: విహారయాత్రలో విషాదం.. మహానదిలో పడవ బోల్తా..!

సుమారు రెండు నెలలుగా స్మశానం గోడ కూలిపోయేలా ఉందని, దానికి మరమ్మతులు చేయాలని నిర్వాహకుడికి చెప్పినా.. అతను పట్టించుకోలేదని తాన్య తల్లి వాపోయింది. ఆ గోడ పక్కనుంచి ఏ వాహనం వెళ్లినా అది కదులుతుందని, అప్పటి నుంచి ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతూ ఉన్నామని, ఈరోజు తన కూతురే ఆ గోడకు బలైందంటూ గుండెలవిసేలా రోధించింది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×