E-Paper
Advertisement

Boat Capsized Mahanadi: విహారయాత్రలో విషాదం.. మహానదిలో పడవ బోల్తా!

Boat Capsized Mahanadi: విహారయాత్రలో విషాదం.. మహానదిలో పడవ బోల్తా!

A Boat Capsized Mahanadi: విహార యాత్ర కాస్త విషాదంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. పిక్నిక్ తర్వాత తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఒక్కసారిగా పడవ నదిలో బోల్తాపడింది. ఈ ఘటన ఒడిషాలోని మహానదిలో చోటు చేసు కుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు, పలువురు జాడ కనిపించలేదు. ఇంకా రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతంది. అసలేం జరిగింది?

ఛత్తీస్‌గడ్ సరిహద్దు లఖన్‌పూర్ నుంచి దాదాపు 50 మంది పడవలో ఒడిషాలోని బరగడ్ జిల్లా బంజిపల్లికి పిక్నిక్ కోసం వచ్చారు. అంతా బాగానే జరిగింది.. అంతా ఎంజాయ్ చేశారు. తిరిగి సాయంత్రం ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. వెంటనే నదిలో బోటు తిరగబడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు మరో ఏడుగురు గల్లంతయ్యారు. అయితే సమీపంలోని మత్సృకారులు బోటు తిరగబడడం గమనించి అక్కడికి వెళ్లారు.

దాదాపు 41మందిని రక్షించి వాళ్లని ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న ఝార్సుగూడ జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. తర్వాత గాలింపు ముమ్మరం చేసింది. గల్లంతైన ఏడుగురు ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, ఆ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

Also Read: సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్

స్కూబా డ్రైవర్లు, సెర్చ్ లైట్లను అక్కడికి పంపారు. మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరికొందరి కోసం సెర్చ్ జరుగుతోంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం నవీన్ పట్నాయక్, ఒక్కో ఫ్యామిలీకి నాలుగు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×