E-Paper
Advertisement

Boat Capsized Mahanadi: విహారయాత్రలో విషాదం.. మహానదిలో పడవ బోల్తా!

Boat Capsized Mahanadi: విహారయాత్రలో విషాదం.. మహానదిలో పడవ బోల్తా!
Advertisement

A Boat Capsized Mahanadi: విహార యాత్ర కాస్త విషాదంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. పిక్నిక్ తర్వాత తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఒక్కసారిగా పడవ నదిలో బోల్తాపడింది. ఈ ఘటన ఒడిషాలోని మహానదిలో చోటు చేసు కుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు, పలువురు జాడ కనిపించలేదు. ఇంకా రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతంది. అసలేం జరిగింది?

ఛత్తీస్‌గడ్ సరిహద్దు లఖన్‌పూర్ నుంచి దాదాపు 50 మంది పడవలో ఒడిషాలోని బరగడ్ జిల్లా బంజిపల్లికి పిక్నిక్ కోసం వచ్చారు. అంతా బాగానే జరిగింది.. అంతా ఎంజాయ్ చేశారు. తిరిగి సాయంత్రం ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. వెంటనే నదిలో బోటు తిరగబడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు మరో ఏడుగురు గల్లంతయ్యారు. అయితే సమీపంలోని మత్సృకారులు బోటు తిరగబడడం గమనించి అక్కడికి వెళ్లారు.

Advertisement

దాదాపు 41మందిని రక్షించి వాళ్లని ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న ఝార్సుగూడ జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. తర్వాత గాలింపు ముమ్మరం చేసింది. గల్లంతైన ఏడుగురు ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, ఆ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

Also Read: సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్

Advertisement

స్కూబా డ్రైవర్లు, సెర్చ్ లైట్లను అక్కడికి పంపారు. మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరికొందరి కోసం సెర్చ్ జరుగుతోంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం నవీన్ పట్నాయక్, ఒక్కో ఫ్యామిలీకి నాలుగు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Tags

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×