E-Paper
Advertisement

CWC Meeting in Delhi: ముగిసిన సీడబ్ల్యూసీ భేటి.. తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులు ఫిక్స్!

CWC Meeting in Delhi: ముగిసిన సీడబ్ల్యూసీ భేటి.. తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులు ఫిక్స్!
Advertisement

Lok Sabha Elections 2024

CWC special meeting in Delhi(Today news paper telugu): ఢిల్లీలో CWC ప్రత్యేక సమావేశం ముగిసింది. AICC కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో.. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోకు కాంగ్రెస్‌ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

Advertisement

రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాలే లక్ష్యంగా భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట ఇప్పటికే తమ హామీలను ప్రజలముందు ఉంచిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించేందుకు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం పెంపు, నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యోగాలు కల్పించడం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలో ఒక మహిళలకు సంవత్సరానికి రూ. లక్షసాయం, 30 ఏళ్ల లోపు యువత స్టార్టప్ లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ వంటి హామీలు, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు తీసుకున్న చర్యలు గురించి చర్చించనట్లు తెలుస్తోంది.

Also Read: బీహార్‌లో కుదిరిన ఒప్పందం.. బీజేపీ, జేడీయూ మధ్య ఎంపీ సీట్ల పంపకాలు ఇలా..

Advertisement

లోక్ సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్ధుల మూడో జాబితాను ప్రకటించేందుకు గాను సీఈసీ సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో తెలంగాణలో నాలుగురు లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేశారు. ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, మల్కాజిగిరి నుంచి పట్నం సునితా రెడ్డి, చేవెళ్ల నుంచి రంజీత్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మల్లురవిని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. మిగిలిన 9 స్థానాలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు అధిష్టానం తెలిపింది. దీంతో పాటుగా మరి కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థులు కమిటీ ఎంపిక చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో 82 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×