E-Paper
Advertisement

Kuwait Fire Accident Dead Bodies : కేరళ చేరుకున్న కువైట్ ప్రమాద మృతదేహాలు.. ఎయిర్ పోర్టులో నివాళులు

Kuwait Fire Accident Dead Bodies : కేరళ చేరుకున్న కువైట్ ప్రమాద మృతదేహాలు.. ఎయిర్ పోర్టులో నివాళులు
Advertisement

Kuwait Fire Accident Dead Bodies : కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు భారత్ కు చేరుకున్నాయి. ఇండియన్ నేవీ విమానంలో కువైట్ నుంచి మృతదేహాలు తీసుకొచ్చారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా అదే విమానంలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మృతులకు ఎయిర్‌పోర్టులో నివాళులు అర్పించారు. కొచ్చి విమానాశ్రయం దగ్గర అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. కాసేపట్లో ఆ మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించనున్నారు. ఇక మిగిలిన రాష్ట్రాలకు చెందిన మృతదేహాలు ఆయా రాష్ట్రాలకు పంపిస్తారు.

కువైట్ అగ్ని ప్రమాదంలో 49 మంది మృతి చెందారు. అందులో 45 మంది భారతీయులే ఉన్నారు. ప్రమాదంలో మరణించినవారిలో 23 మంది కేరళకు చెందినవారు కాగా, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ముగ్గురు కూడా ఉన్నారు. ఏపీలో శ్రీకాకుళం జిల్లాకి చెందినవారు ఒకరు, తూర్పు గోదావరికి చెందిన వారు ఇద్దరు మృతి చెందారు. ఆ ఇద్దరి మృతదేహాలు కూడా చేరుకున్నాయి. కాసేపట్లో మృతదేహాలను అధికారులు వారి స్వస్థలానికి తరలించనున్నారు.

Advertisement

మృతుల్లో బిహార్‌, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, హర్యానా, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ప్రధాని ఆదేశాలతో నిన్న కువైట్ వెళ్లిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్.. అక్కడి అధికారులతో చర్చించారు. మృతదేహాలను అప్పగించే విషయంపై మాట్లాడారు. ఫార్మాలటీస్ పూర్తి అయిన తర్వాత ప్రత్యేక విమానంలో మృతదేహాలు భారత్ కు చేరుకున్నాయి. ఇక నిన్న కేంద్రమంత్రి కువైట్ లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు.

Tags

Related News

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×