BigTV English
Advertisement

Congress-AAP: ఢిల్లీలో సీట్లసర్దుబాటు కొలిక్కి.. ఆప్‌ కి నాలుగు.. కాంగ్రెస్‌కి మూడు..

Congress-AAP: ఢిల్లీలో సీట్లసర్దుబాటు కొలిక్కి.. ఆప్‌ కి నాలుగు.. కాంగ్రెస్‌కి మూడు..

Congress-AAP alliance: ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఓ అంగీకారానికి వచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నిక వేళ కాంగ్రెస్, ఆప్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చినట్లు వచ్చింది. ఢల్లీలో ఏడు స్థానాల్లో ఆఫ్ నాలుగు చోట్ల, కాంగ్రెస్ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. అయితే దీనిపై ఆ పార్టీల నుంచి త్వరలోనే ప్రకటన వెలువడనుంది.


తమ రెండు పార్టీ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.

మొదట పొత్తలో భాగంగా కాంగ్రెస్ కు ఆప్ ఒక్క సీటు ఆఫర్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ కు ఒక్క సీటే ఎక్కువ, పొత్తు ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ొక్కటీ ప్రతిపాదించామని ఆప్ ఎంపీ సందీప్ పాథక్ గతంలో వ్యాఖ్యలు చేశారు. దాంతో రెండు పార్టీల మద్య పొత్తు కుదరకపోవచ్చనే వార్తలు వినిపించాయి. కాగా.. త2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ ఏడు ఎంపీ సీట్లను బీజేపీనే సొంతం చేసుకుంది.


ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బుధవారం వివక్ష ఇండియా కూటమిలో సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చింది. యూఫీలో 80 స్థానాలకు గానూ 17 చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనుంది. మిగిలిన 63 చోట్ల సమాజ్ వాదీ పార్టీ, ఇతర మిత్ర పక్షాలు బరిలో దిగనున్నారు.

కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో రాయ్బరేలీ, అమేఠీ, వారణాసి, ఝాన్సీ, మధుర, గాజియాబాద్ వంటివి ఉన్నాయి. ప్రతిష్టంభనకు తొలగించడానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చొరవ తీసుకున్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో పాటు ఫోన్లో మాట్లాడడంతో పొత్తుకు మార్గం సుగమం అయ్యింది.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×