IndiGo Tickets Refund: ఇండిగో విమాన అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వందల సంఖ్యలో ఇండిగో సంస్థ విమానాల రద్దు చేసింది. శనివారం కూడా విమానాల రద్దు కొనసాగుతోంది. ఇప్పటికే ఇండిగో తీరుపై దర్యాప్తదు చేపట్టిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
పెండింగ్లో ఉన్న ప్రయాణికుల విమాన టికెట్ల రిఫండ్లను ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రద్దు అయిన లేదా అంతరాయం కలిగిన అన్ని విమానాల రిఫండ్ ప్రక్రియను డిసెంబర్ 7, 2025 రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని ఇండిగోను ఆదేశించారు. రద్దైన విమానాలను రేపటికల్లా తిరిగి షెడ్యూల్ చేయాలని పేర్కొన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే ప్రయాణికుల నుంచి రీషెడ్యూలింగ్ ఛార్జీలు వసూలు చేయవద్దని విమానయాన సంస్థలకు సూచించారు. ఏదైనా సంస్థ నిబంధనలను పాటించకపోతే నియంత్రణ చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ప్రయాణికుల కోసం రిఫండ్ సెల్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రిఫండ్ అమౌంట్ వీలైనంత తొందరగా చెల్లించేందుకు ఆటోమేటిక్ రిఫండ్లను సదుపాయం కల్పించాలని ఇండిగో సంస్థకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించారు.
Also Read: Airplane Catches Fire: టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 180 మంది ప్రయాణికులు
48 గంటల్లోపు ప్రయాణికుల లగేజీలను గుర్తించి, వారి ఇంటికి డెలివరీ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీనియర్ సిటిజన్లు, వికలాంగులైన ప్రయాణికులు, అత్యవసర ప్రయాణం అవసరమయ్యే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం రామ్మోహన్ నాయుడు తెలిపారు.