E-Paper
Advertisement

IndiGo Tickets Refund: రిఫండ్ వెంటనే చెల్లించాలి.. రేపటికల్లా విమానాలు నడకపోతే తీవ్ర చర్యలు.. కేంద్రం వార్నింగ్

IndiGo Tickets Refund: రిఫండ్ వెంటనే చెల్లించాలి.. రేపటికల్లా విమానాలు నడకపోతే తీవ్ర చర్యలు.. కేంద్రం వార్నింగ్

IndiGo Tickets Refund: ఇండిగో విమాన అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వందల సంఖ్యలో ఇండిగో సంస్థ విమానాల రద్దు చేసింది. శనివారం కూడా విమానాల రద్దు కొనసాగుతోంది. ఇప్పటికే ఇండిగో తీరుపై దర్యాప్తదు చేపట్టిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

రిఫండ్ పై డెడ్ లైన్

పెండింగ్‌లో ఉన్న ప్రయాణికుల విమాన టికెట్ల రిఫండ్లను ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రద్దు అయిన లేదా అంతరాయం కలిగిన అన్ని విమానాల రిఫండ్ ప్రక్రియను డిసెంబర్ 7, 2025 రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని ఇండిగోను ఆదేశించారు. రద్దైన విమానాలను రేపటికల్లా తిరిగి షెడ్యూల్ చేయాలని పేర్కొన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రిఫండ్ సెల్ లు ఏర్పాటు

అలాగే ప్రయాణికుల నుంచి రీషెడ్యూలింగ్ ఛార్జీలు వసూలు చేయవద్దని విమానయాన సంస్థలకు సూచించారు. ఏదైనా సంస్థ నిబంధనలను పాటించకపోతే నియంత్రణ చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ప్రయాణికుల కోసం రిఫండ్ సెల్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. రిఫండ్ అమౌంట్ వీలైనంత తొందరగా చెల్లించేందుకు ఆటోమేటిక్ రిఫండ్లను సదుపాయం కల్పించాలని ఇండిగో సంస్థకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించారు.

Also Read: Airplane Catches Fire: టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 180 మంది ప్రయాణికులు

48 గంటల్లోపు లగేజీ గుర్తించాలి

48 గంటల్లోపు ప్రయాణికుల లగేజీలను గుర్తించి, వారి ఇంటికి డెలివరీ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీనియర్ సిటిజన్లు, వికలాంగులైన ప్రయాణికులు, అత్యవసర ప్రయాణం అవసరమయ్యే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×