E-Paper
Advertisement

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం.. రాజకీయాల నుంచి రిటైర్డ్ హర్ట్..

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం.. రాజకీయాల నుంచి రిటైర్డ్ హర్ట్..
Advertisement

Gautam Gambhir Quitting PoliticsGautam Gambhir Quitting Politics(Today news paper telugu): బీజేపీ లోక్‌సభ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ క్రికెట్ ప్రణాలికల దృశ్యా అతను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గంభీర్ శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాజకీయ బాధ్యతల నుంచి తనని తప్పించాలని అభ్యర్ధించారు.

తూర్పు ఢిల్లీ ఎంపీగా ఉన్న గంభీర్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Read More: Annamalai On Contesting Lok Sabha Polls: ఊహాగానాలకు స్పందించను.. పార్టీ ఏది చెబితే అది చేస్తా..

“రాజకీయ బాధ్యతల నుంచి నన్ను విముక్తి చేయాలని.. గౌరవనీయులైన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థించాను. తద్వారా నేను నా రాబోయే క్రికెట్ కట్టుబాట్లపై దృష్టి పెట్టగలను. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హొం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు,” అని గంభీర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Advertisement

2024 లోక్‌సభ ఎన్నికల కోసం 100 మందికి పైగా అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ త్వరలో విడుదల చేయనుందని సమాచారం. పార్టీ ఢిల్లీలో రాత్రిపూట మారథాన్ సమావేశాలను నిర్వహించింది, ప్రధానమంత్రి నేతృత్వంలోని ఢిల్లీలోని ఆయన నివాసంలో గురువారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ముగిసింది.

అటు టికెట్ రాదనే గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా 2019లో ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన గంభీర్ తన సమీప అభ్యర్ధి.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అర్విందర్ సింగ్ లవ్లీపై 3 లక్షల 91 వేల 222 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.

ముఖ్యంగా, మిస్టర్ గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అతని కమిట్‌మెంట్స్ కారణంగా రాబోయే నెలలు పూర్తి బిజీగా ఉండనున్నారు. కెప్టెన్ గా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు రెండు టైటిల్స్ అందించారు. ప్రస్థుతం అతను కేకేఆర్ జట్టుకు మెంటర్ గా వ్వవహరిస్తున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవ్వనుంది. దీంతో గంభీర్ పూర్తిగా క్రికెట్‌పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ICC T20 ప్రపంచ కప్ 2007, ICC క్రికెట్ ప్రపంచ కప్ 2011 సాధించిన భారత జట్లలో గంభీర్ కీలక ఆటగాడు. భారతదేశం తరపున 242 మ్యాచ్‌లలో, గంభీర్ 20 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలతో 38.95 సగటుతో 10,324 పరుగులు చేశారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో 97 పరుగులు చేసి టీమిండియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×