E-Paper
Advertisement

ED Case On Kerala CM Daughter: పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ కేసు..

ED Case On Kerala CM Daughter: పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ కేసు..
Advertisement
ED Case On Pinaray Vijayan  Daughter
ED Case On Pinarayi Vijayan  Daughter

ED Case On Pinarayi Vijayan  Daughter: సార్వత్రిక ఎన్నికల ముందు కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణాపై ఈడీ కేసు నమోదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. పీఎంఎల్ఏ కింద ఈడీ ఈ కేసు నమోదు చేసింది. అలాగే ఇంకొందరిపైనా అక్రమ నగదు చలామణి చట్టం  కింద కేసులు నమోదు చేసింది.

వీణా విజయన్ చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేట్ కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

Advertisement

కొన్ని రోజుల క్రితం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ అంశంపై దృష్టిపెట్టింది. ఈ వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. వీణా విజయన్, ఆమె సంస్థతోపాటు ఇంకొందరిపైనా ఈడీ పీఎంఎల్ఏ కింద కేసులు నమోదు చేసింది.

Also Read: కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా రియాక్షన్.. భారత్ అభ్యంతరం..

Advertisement

కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అనే కంపెనీ వీణా విజయన్ కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు రూ. 1.72 కోట్లు చెల్లింపులు చేసింది. 2018-19 మధ్య అక్రమంగా ఈ లావాదేవీలు జరిగాయని ఐటీ శాఖ గుర్తించింది. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ఎలాంటి సేవలు అందించకుండానే కొచ్చిన్ మినరల్స్ ఈ నిధులు మల్లించినట్లు నిర్దారించింది.

మరోవైపు ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ పై ఎస్ఎఫ్ఐఓ విచారణ జరిపింది. ఈ రెండు సంస్థల మధ్య అక్రమ చెల్లింపులు జరిగాయని తేల్చింది. అయితే ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ సొల్యూషన్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×