E-Paper
Advertisement

ED Case On Kerala CM Daughter: పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ కేసు..

ED Case On Kerala CM Daughter: పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ కేసు..
ED Case On Pinaray Vijayan  Daughter
ED Case On Pinarayi Vijayan  Daughter

ED Case On Pinarayi Vijayan  Daughter: సార్వత్రిక ఎన్నికల ముందు కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణాపై ఈడీ కేసు నమోదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. పీఎంఎల్ఏ కింద ఈడీ ఈ కేసు నమోదు చేసింది. అలాగే ఇంకొందరిపైనా అక్రమ నగదు చలామణి చట్టం  కింద కేసులు నమోదు చేసింది.

వీణా విజయన్ చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేట్ కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

కొన్ని రోజుల క్రితం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ అంశంపై దృష్టిపెట్టింది. ఈ వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. వీణా విజయన్, ఆమె సంస్థతోపాటు ఇంకొందరిపైనా ఈడీ పీఎంఎల్ఏ కింద కేసులు నమోదు చేసింది.

Also Read: కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా రియాక్షన్.. భారత్ అభ్యంతరం..

కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అనే కంపెనీ వీణా విజయన్ కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు రూ. 1.72 కోట్లు చెల్లింపులు చేసింది. 2018-19 మధ్య అక్రమంగా ఈ లావాదేవీలు జరిగాయని ఐటీ శాఖ గుర్తించింది. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ఎలాంటి సేవలు అందించకుండానే కొచ్చిన్ మినరల్స్ ఈ నిధులు మల్లించినట్లు నిర్దారించింది.

మరోవైపు ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ పై ఎస్ఎఫ్ఐఓ విచారణ జరిపింది. ఈ రెండు సంస్థల మధ్య అక్రమ చెల్లింపులు జరిగాయని తేల్చింది. అయితే ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ సొల్యూషన్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×