Wing-to-wing collision between 2 planes at Kolkata Airport: కోల్కతా విమానాశ్రయంలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాల రెక్కలు ఢీకొన్నాయి. ఈ సంఘటన ఉదయం 11:10 గంటలకు జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాదానికి గురైన విమానాలలో ఒక విమానం చెన్నైకి వెళ్తుండగా, మరొకటి దర్భంగాకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఈ సమయంలో రెండు విమానాలు రెక్కలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో చెన్నైకి వెళ్లే విమానం రెక్కల కొన విరిగిపోగా, దర్భంగా వెళ్లే విమానం రెక్క కూలిపోయింది.
ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు సమాచారం అందించారు. ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీ ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణను ప్రారంభించింది.
Also Read: మహారాష్ట్రలో కిచిడీ రాజకీయం.. ఎంవీఏ కూటమిలో భగ్గుమన్న విభేదాలు
ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఆ సమయానికి విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 163 మంది ప్రయాణికులు కూర్చున్నారు. ఇంతలో, ఇండిగో ఫ్లైట్ 6E 6152 కోల్కతా నుండి దర్భంగాకి బయలుదేరడానికి సిద్ధమవుతోంది, విమానంలో 6 క్యాబిన్ సిబ్బందితో పాటు 149 మంది ప్రయాణికులు ఉన్నారు.