E-Paper
Advertisement

Arvind Kejriwal arrest Issue : కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా రియాక్షన్.. భారత్ అభ్యంతరం..

Arvind Kejriwal arrest Issue : కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా రియాక్షన్.. భారత్ అభ్యంతరం..
Advertisement
Kejriwal arrest Updates
Kejriwal arrest Updates

Kejriwal arrest Updates: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇతర దేశాల జోక్యంపై భారత్ మరోసారి తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు. ఈ వ్యవహారంపై రిపోర్ట్స్ ను సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. ఇలా అగ్రరాజ్యం స్పందించడంపై భారత్ అభ్యంతరం తెలిపింది.

ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు భారత్ నోటీసులు జారీ చేసింది. యూఎస్ రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనాను పిలిచి ఈ విషయంపై మాట్లాడింది. బెర్బేనా బుధవారం ఢిల్లీ సౌత్ బ్లాక్ లోని భారత్ విదేశాంగ శాఖ ఆఫీస్ కు వచ్చారు.

Advertisement

30 నిమిషాలపాటు భారత్ అధికారులు.. బెర్బేనాతో మాట్లాడారు. భారత్ సౌర్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. ప్రజాస్వామ్య దేశాల విషయంలో బాధ్యతతో వ్యవహారించాలని గట్టిగా చెప్పింది. లేదంటే దౌత్య బంధాలు దెబ్బతింటాయని పేర్కొంది. భారత్ లో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని స్పష్టం చేసింది. ఈ విషయాలపై మాట్లాడటం సరికాదని అమెరికాకు భారత్ తేల్చి చెప్పింది.

Also Read:  టెన్షన్‌లో కేజ్రీవాల్ మద్దతుదారులు, తీర్పు ఎటు వైపు?

Advertisement

ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్ పై జర్మనీ స్పందించింది. అప్పడు కూడా భారత్ దీటుగా బదులిచ్చింది.  భారత్‌ ప్రజాస్వామ్య దేశంగా పేర్కొన్న జర్మనీ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ విషయంలో పారదర్శకంగా విచారణ జరగాలని పేర్కొంది. భారత్ లోని చట్టపరంగా ఉన్న అన్ని మార్గాలను కేజ్రీవాల్  వినియోగించుకోవాలని సూచించింది. భారత్ అంతర్గత వ్యవహారంలో జర్మనీ తలదూర్చడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జర్మనీ రాయబారికి నోటీసులు ఇచ్చింది. వివరణ కోరింది. ఇప్పుడు అమెరికాకు అదేరీతిలో బదులిచ్చింది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×