BigTV English
Advertisement

Farmers Protest 3rd Day Live Updates: ఢిల్లీలో మూడో రోజు రైతుల ఆందోళన.. పంజాబ్‌లో రైల్వే ట్రాకులపై నిరసన..

Farmers Protest 3rd Day Live Updates: ఢిల్లీలో మూడో రోజు రైతుల ఆందోళన.. పంజాబ్‌లో రైల్వే ట్రాకులపై నిరసన..
Farmers Protest in delhi

Farmers Protest in delhi(Live tv news telugu): ఢిల్లీలో రైతులు ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఢిల్లీ చలో కార్యక్రమం మూడో రోజుకు చేరింది. రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్ ఆధ్వర్యంలో పంజాబ్‌లో రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాకులను రైతులు దిగ్బందించారు. రైల్వే ట్రాకులపై కూర్చొని భారత్ కిసాన్ యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. తమ డిమాండ్లను నెరవేరే వరకూ వెనక్కి తగ్గేదే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు.


మరోవైపు రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. చండీగఢ్‌లో సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు జరపనుంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని కేంద్రం పిలిచినట్టు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధర్ తెలిపారు.

అటు.. రైతులపై పంజాబ్‌లో ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం సరికాదని సర్వన్ సింగ్ పంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా నిరసనలో భారత్ కిసాన్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. గురువారం రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్ ఆధ్వర్యంలో పంజాబ్‌లో రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాకులను రైతులు దిగ్బంధించారు.


రైతుల పట్టుదల చూస్తే డిమాండ్లు నెరవేరే వరకూ వెనక్క తగ్గేలా కనిపించడం లేదు. పంజాబ్‌, హరియాణా సరిహద్దులోని శంభు వద్ద వేల మంది రైతులు మోహరించారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది. బుధవారం ఢిల్లీవైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ట్రై చేయగా పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. దీనికిపై ప్రతిగా కొందరు రైతులు రాళ్ల దాడి చేశారు.

Read More:షేర్ల పతనం.. ఈడీ నోటీసులు..! పేటీఎంకు డబుల్ షాక్..

శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై పెద్దఎత్తున గుంతలు తవ్వారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా, తమ డిమాండ్లు నెరవేరే వరకూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం వెర్షన్ మరోలా ఉంది. రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని, వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

పోలీసుల దాడులను ముందుగానే అంచనా వేసిన రైతులు పక్కా ప్లాన్‌తోనే ఆందోళనలకు దిగారు. బాష్ప వాయువు నుంచి వచ్చే పొగనుంచి రక్షణ కోసం నీళ్ల ట్యాంకులను రైతులు తెచ్చి పెట్టుకున్నారు. నీళ్ల సీసాలను, తడి బట్టలను సిద్ధంగా చేసుకున్నారు. మరికొందరైతే శరీర రక్షణ పరికరాలను, కళ్ల రక్షణ అద్దాలనూ ధరించారు. రైతుల ఆందోళనలతో హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర, కైతాల్‌, జింద్‌, హిసార్‌, ఫతేహాబాద్‌, సిర్సా జిల్లాల్లో వాయిస్‌ కాల్స్‌ మినహా మిగతా అన్ని మొబైల్‌ సేవలను నిలిపివేశారు. గురువారం కూడా మొబైల్ సేవలను రద్దు చేశారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×