BigTV English
Advertisement

Bus Collided Car: కారును ఢీ కొట్టిన బస్సు.. ఐదుగురు సజీవదహనం

Bus Collided Car: కారును ఢీ కొట్టిన బస్సు.. ఐదుగురు సజీవదహనం

Uttarpradesh Road Accident: ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన మధుర పరిధిలోని మహవాన్ వద్ద యమునా ఎక్స్ ప్రెస్ వే పై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న బస్సు.. కారును ఢీ కొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. వీరంతా సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సు కారును ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.


కాగా.. సిక్కింలోని గ్యాంగ్ టక్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రాణిపోల్ ప్రాంతంలో ఒక పాల ట్యాంకర్ రోడ్డుపై నిలబడి ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 150 మంది గాయపడ్డారు. వారిలో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read More : విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి..


రాణిపూల్ లోని తాంబ్లా గేమ్ ఫెయిర్ లో ఆదివారం రాత్రి సుమారు 7.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాణిపూర్ టాటా మైదానం జనాలతో కిటకిటలాడుతుండగా.. సిక్కిం మిల్క్ యూనియన్ ట్యాంకర్ రోడ్డుపై ఉన్న నాలుగు కార్లను ఢీ కొని.. జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో పలువురు ట్యాంకర్ కింద పడి నలిగిపోయారు. ముగ్గురు ఘటనా ప్రాంతంలోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను రాణిపూర్ ఆస్పత్రికి తరలించారు.

మరో ఘటనలో హైదరాబాద్ వాసి మృతి చెందింది. హిమాచల్ ప్రదేశ్ లోని కులూలో ఆదివారం పారా గ్లైడింగ్ చేస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన నవ్య(26) మరణించింది. మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్డైడింగ్ కు వెళ్లగా.. టేకాఫ్ అయిన కొద్దినిమిషాలకే టెన్డం ఫ్లైట్ లో ఈ దదుర్ఘటన జరిగింది. పర్యాటకురాలికి అమర్చిన సేఫ్టీ బెల్ట్ ను తనిఖీ చేయకుండానే పారాగ్లైడింగ్ కు వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్ పైలట్ ను అరెస్ట్ చేశారు.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×