E-Paper
Advertisement

Maharashtra Fire Accident: మహారాష్ట్రలోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ఐదురురు మృతి

Maharashtra Fire Accident: మహారాష్ట్రలోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ఐదురురు మృతి

Maharashtra Fire Accident:మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం  పెను ప్రమాదం జరిగింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ లోపల గందరగోళం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫ్యాక్టరీ లోపల ఉన్న ఇతర ఉద్యోగులను సురక్షితంగా తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ , వైద్య బృందాలను రంగంలోకి దింపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాంప్లెక్స్ లోపల పేలుడు సంభవించిందని జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఫ్యాక్టరీలో భద్రతకు సంబంధించి తలెత్తిన ప్రశ్నలు:
ఈ సంఘటన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. పేలుడు శబ్దం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వినిపించింది. ఈ విషయమై పోలీసులు, ఫ్యాక్టరీ యాజమాన్యం దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×