Shivraj Patil Passes Away: కేంద్ర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్(90) కన్నుమూశారు. వృద్ధాప్త సమస్యలతో మాహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని స్వగ్రహంలో.. ఉదయం 6.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. 1992లో రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ రెండు సార్లు ఎమ్మెల్యే, ఏడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇందిర రాజీవ్, మన్మోహన్ క్యాబినెట్ లలో డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హోంమంత్రిగా పని చేశారు. ఆ తరువాత 10 వ లోక్ సభ స్పీకర్గా, 2004-2008 వరకు కేంద్ర హోంమంత్రిగా.. పంజాబ్ గవర్నర్గా, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటర్గా కూడా సేవలందించారు శివరాజ్ పాటిల్.
నైతిక విలువలు.. హుందాతనంతో రాజకీయాలు నెరిపిన పెద్ద మనిషి శివ్ రాజ్ పాటిల్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి.. లోక్ సభ మాజీ స్పీకర్ శివ్ రాజ్ పాటిల్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి ప్రస్థానం ప్రారంభించిన పాటిల్ 7 సార్లు ఎంపీగా, లోక్ సభ స్పీకర్ గా, కేంద్ర హోంశాఖా మంత్రిగా, పంజాబ్ గవర్నర్ గా ఆయన సేవలందించారని సీఎం తెలిపారు.
మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివరాజ్ పాటిల్ మృతి పట్ల.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా శివరాజ్ పాటిల్ అనేక పదవులు నిర్వహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రార్థించారు.