E-Paper
Advertisement

Gang War at Udupi: మిడ్ నైట్.. రెండు గ్యాంగుల ఫైటింగ్.. ఆర్థిక లావాదేవీలా..!

Gang War at Udupi: మిడ్ నైట్.. రెండు గ్యాంగుల ఫైటింగ్.. ఆర్థిక లావాదేవీలా..!
Advertisement

Gang War at Udupi: గ్యాంగ్ వార్ అంటే సహజంగా రెండు గ్యాంగులు కొట్టుకోవడం చూస్తాం. ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలకు దిగుతారు. అక్కడ అలా కాదు ఏకంగా కార్లతో ఢీ కొట్టుకున్నాయి. ఆ తర్వాత ఇరువర్గాల వ్యక్తులు బయటకు వచ్చి రాళ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. మరో నలుగురు కోసం గాలింపు చేపట్టారు.

అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే… మే 18న రాత్రి సరిగ్గా పదకొండున్నర దాటి నిమిషాల ముల్లు 12 గంటల వైపు వెళ్తోంది. ఆ సమయంలో ఆరుగురు యువకులు ఉడుపి-మణిపాల్ హైవే పైకి రెండు కార్లతో వచ్చారు. వచ్చి రాగానే ఒక కారు మరొకదాన్ని ఢీ కొట్టింది. వెంటనే రెండు కార్లలోని వ్యక్తులు బయటకు వచ్చి ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం మొదలైంది.

Advertisement

గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి మరొక కారును ఆపే ప్రయత్నం చేశాడు. వాడ్ని హిట్ కొడుతూ ముందుకు సాగింది ఇంకొకటి. మళ్లీ ఆ కారు టర్న్ తీసుకుని వచ్చింది. కాసేపు రెండు కార్లు ఢీకొన్నాయి. వాహనాలు వెళ్తుండగానే గ్యాంగ్‌లకు సంబంధించిన వ్యక్తులు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఒకరిపై మరొకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Also Read: దక్షిణాదిన దంచికొట్టుడు.. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు

Advertisement

ఈ తతంగాన్ని రోడ్డుపై బిల్డింగ్‌లో ఉన్న ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఫైటింగ్‌లో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీల కారణంతోనే ఈ గొడవ జరిగినట్టు సమాచారం. వీడియో ఆధారంగా ఇద్దరు అదుపులోకి తీసుకున్న ఉడుపి పోలీసులు, మరో నలుగురి కోసం గాలింపు తీవ్రం చేశారు. ఈ యవ్వారంపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.

Tags

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×