E-Paper
Advertisement

BJP candidate Assets: నా ఆస్తులు రూ.1400 కోట్లు, దుబాయ్, లండన్‌..!

BJP candidate Assets: నా ఆస్తులు రూ.1400 కోట్లు, దుబాయ్, లండన్‌..!

BJP candidate Assets: సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్కో విడత నోటిఫికేషన్ విడుదల చేస్తోంది ఎన్నికల సంఘం. కొన్నిచోట్ల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. తాజాగా డబ్బున్నవాళ్లు ఈసారి ఎన్నికల బరిలో ఎక్కువగానే ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వారిలో ఒకరు గోవా బీజేపీ అభ్యర్థి పల్లవి డింపో. ఈమె ఆస్తుల ఎంతో తెలుసా? అక్షరాలా 1400 వందల కోట్ల రూపాయలు. విచిత్రంగా ఉంది కదూ. ఇంకా లోతుల్లోకి వెళ్తే…

దక్షిణ గోవా నుంచి బీజేపీ అభ్యర్థిగా పల్లవి డింపో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకి సంబంధించిన ఆస్తుల చిట్టాను వెల్లడించారు. మొత్తం 119 పేజీల అఫిడవిట్‌లో దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించి తెలిపారు. ఓవరాల్‌గా ఆస్తుల విలువ 1400 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. పల్లవి పేరిట 255 కోట్ల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆమె భర్త శ్రీనివాస్ పేరిట ఆస్తుల విలువ అక్షరాలా 994 కోట్లు. ఇక పల్లవి స్థిరాస్తుల విలువ ప్రస్తుతానికి 28 కోట్లు కాగా, ఆమె భర్తకు 83 కోట్ల రూపాయలు ఉన్నట్లు ప్రస్తావించారు.

Goa bjp candidate pallavi dempo
Goa bjp candidate pallavi dempo

గోవాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను కూడా వెల్లడించారామో. దుబాయ్‌లో పల్లవి దంపతులకు అపార్ట్‌మెంటు ఉంది. దీని విలువ రెండున్నర కోట్ల రూపాయలు. లండన్‌లో ఉన్న అపార్ట్‌మెంటు దాదాపు 10 కోట్ల రూపాయలు. లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయి. అంతేకాదు బంగారు ఆభరణాల విలువ అక్షరాల ఐదున్నర కోట్ల పైమాటే. గతేడాది ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినవి 10 కోట్లు పల్లవి వంతు కాగా, ఆమె భర్త శ్రీనివాస్ 11 కోట్ల రూపాయలు.

ALSO READ: మోదీ సర్కార్ అతి పెద్ద అవినీతి

ఈమె పూణెలోని బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశారు. పల్లవి.. శ్రీనివాస్‌ను మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన డింపో గ్రూపులకు ఛైర్మన్. ఆ గ్రూపులో ఫుట్‌బాల్, రియల్ ఎస్టేట్, షిప్ బిల్డింగులు, ఎడ్యుకేషన్, మైనింగ్ వంటి విభాగాలున్నాయి.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×