E-Paper
Advertisement

H3N2 Virus : H3N2 వైరస్ డేంజర్ బెల్స్.. ఇద్దరు మృతి.. కేంద్రం అలెర్ట్..

H3N2 Virus : H3N2 వైరస్ డేంజర్ బెల్స్.. ఇద్దరు మృతి.. కేంద్రం అలెర్ట్..

H3N2 Virus : దేశంలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ దడ పుట్టిస్తోంది. ఈ మధ్యకాలంలో ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇన్‌ఫ్లుయెంజా ఏ ఉప రకమైన ‘హెచ్‌3ఎన్‌2’ వైరస్‌ వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. హర్యానా, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌ లక్షణాలతో మరణించారని ప్రకటించింది.

కర్ణాటక హసన్‌ జిల్లాకు చెందిన 82 ఏళ్ల హీరే గౌడ హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా మార్చి 1న మృతిచెందారని ఆ జిల్లా ఆరోగ్య అధికారి ప్రకటించారు. బాధితుడు ఫిబ్రవరి 24న ఆసుపత్రిలో చేరాడని తెలిపారు. ఆయన శాంపిల్‌ను పరీక్ష చేయగా.. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ నిర్ధారణ అయినట్లు వివరించారు. మృతుడు హీరే గౌడకు బీపీ, షుగర్‌ ఉన్నట్లు ఆరోగ్య అధికారి తెలిపారు. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వల్ల మరణం సంభవించినట్లు హర్యానా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కొవిడ్‌ తరహా లక్షణాలున్న ఇన్‌ఫ్లుయెంజా కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధివల్ల బాధితులు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అందువల్లే రోగులు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇటీవల ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90కి పైగా హెచ్‌3ఎన్‌2 కేసులు నమోదయ్యాయి. ఇన్‌ఫ్లుయెంజా మరో రకమైన హెచ్‌1ఎన్‌1 కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి ఈ వైరస్‌ ప్రధాన లక్షణాలు. ఈ వైరస్‌ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతోంది. దగ్గు మాత్రం 3 వారాల వరకు రోగులను వేధిస్తోంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×